Teegala Krishna Reddy : మహేశ్వరంలో సబితకు బిగ్ షాక్.. చక్రం తిప్పిన రేవంత్.. హస్తం గూటికి తీగల?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 October 2023,5:00 pm

Teegala Krishna Reddy : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కాయి. దానికి కారణం.. ఇంకో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగడం. ఇంకో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటోంది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం.. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వలసలే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

కాంగ్రెస్ లోకి చేరికలు మాత్రం ఆగడం లేదు. ఈనేపథ్యంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఆయన ఒక్కరే కాదు.. ఆయన కోడలు అనితా రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. 2014 లో టీడీపీ నుంచి గెలుపొందిన తీగల.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సబితా కూడా బీఆర్ఎస్ లో చేరారు. అయితే.. బీఆర్ఎస్ లో తనకు మహేశ్వరం టికెట్ వస్తుందని ఇన్నిరోజులు తీగల ఆశించారు. కానీ.. ఈసారి మహేశ్వరం టికెట్ ను సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. దీంతో తీగలకు బిగ్ షాక్ తగిలినట్టయింది. అందుకే.. కాంగ్రెస్ నుంచి మహేశ్వరం టికెట్ హామీ వస్తే కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

teegala krishnareddy to join in congress

#image_title

Teegala Krishna Reddy : కాంగ్రెస్ లో ఘర్ వాపసీ సక్సెస్

ఓవైపు కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు ఘర్ వాపసీ పేరుతో తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చి చేరుతోంది. గాంధీ భవన్ కిక్కిరిసిపోతోంది. పలు పార్టీలకు చెందిన కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోంది. తాజాగా తీగల కూడా కాంగ్రెస్ లో చేరుతుండటంతో అది మహేశ్వరంలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి