Today Top Telugu Breaking News : ఉత్తరాఖండ్ సొరంగం నుంచి అందరూ క్షేమం.. రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర.. పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి కాంస్య పతకం.. తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చే వారికి ఓటు వేయకండన్న జయప్రకాశ్

Advertisement
Advertisement

Today Top Telugu Breaking News : ఉత్తరాఖండ్(Uttarakhand Tunnel Rescue) లోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న కూలీలందరినీ అధికారులు రక్షించారు. 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

Advertisement

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో(India vs Australia Third T20) భారత్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ గా రుతురాజ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 57 బంతుల్లో 13 ఫోర్లు, 7  సిక్సులు బాది 123 పరుగులు చేశాడు.

Advertisement

టాలీవుడ్ నటి ప్రగతి(Tollywood Actress Pragathi) జాతీయ పవర్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం సాధించారు. బెంగళూరులో జరిగిన 28వ నేషనల్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో మూడో స్థానంలో నిలిచింది.

డబ్బంతా కేవలం తాత్కాలిక అవసరాలకే ఖర్చు పెట్టి రేపు ఏం లేకుండా చేసేవాళ్లు ఖచ్చితంగా మన భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతారని.. తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చే వారికే ఓటు వేయాలని మాజీ ఐఏఎస్, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) అన్నారు. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడానికి ఎవరు దోహదం చేస్తున్నారో వారికే ఓటు వేయాలన్నారు.

అప్పుల భారంతో ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) మండిపడ్డారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.

తెలంగాణలో ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) ఉన్న నేపథ్యంలో నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా బస్ పాస్ కేంద్రాలకు టీఎస్ఆర్టీసీ(TSRTC) సెలవు ప్రకటించింది.

తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాల్ కృష్ణ(AP Minister Venugopal Krishna) డిశ్చార్జ్ అయ్యారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఏపీకి చెందిన ఇందరు ఐఏఎస్ అధికారులు(IAS Officers) హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. తమ ఆదేశాలను ధిక్కరించారని ఐఏఎస్ లు శ్యామలరావు, పోలా భాస్కర్ లకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) బరిలో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నవంబర్ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

2024 టీ20 వరల్డ్ కప్(T20 world cup 2024) కు నమీబియా జట్టు అర్హత సాధించింది. మొత్తం 19 జట్లు ఇప్పటి వరకు క్వాలిఫై అయ్యాయి. తాజాగా నమీబియా(Namibia) చోటు సంపాదించుకుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

29 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.