Today Top Breaking News : హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్.. జై కేసీఆర్ అన్న కాంగ్రెస్ అభ్యర్థిని.. కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Top Breaking News : హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్.. జై కేసీఆర్ అన్న కాంగ్రెస్ అభ్యర్థిని.. కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలు

Today Top Breaking News : సిరిసిల్ల(Sircilla)లోని నేతన్న చౌక్ వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థిని రాణి రుద్రమ(BJP Mla candidate Rani Rudrama) రోడ్ షో నిర్వహించగా.. భారీగా జనం హాజరయ్యారు. హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో(Telangana Congress Manifesto) హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారలంలో భాగంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అనుమాండ్ల యశస్విని(Palakurthy Congress MLA Candidate Anumandla Yashashwini Reddy) […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  కర్ణాటక నుండి తెలంగాణకు కోట్ల రూపాయలు తరలింపు

  •  జై కేసీఆర్ అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని యశశ్విని రెడ్డి

  •  హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలలో 75% రిజర్వేషన్ కల్పిస్తాం అంటూ కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ

Today Top Breaking News : సిరిసిల్ల(Sircilla)లోని నేతన్న చౌక్ వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థిని రాణి రుద్రమ(BJP Mla candidate Rani Rudrama) రోడ్ షో నిర్వహించగా.. భారీగా జనం హాజరయ్యారు.

హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో(Telangana Congress Manifesto) హామీ ఇచ్చింది.

ఎన్నికల ప్రచారలంలో భాగంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అనుమాండ్ల యశస్విని(Palakurthy Congress MLA Candidate Anumandla Yashashwini Reddy) రెడ్డి ప్రచారం ముగిసిన అనంతరం జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసింది.

కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలను తరలించారు. కర్ణాటక నుంచి వచ్చిన కారులో కోటీ 44 లక్షలను వనస్థలిపురం(Vanasthalipuram Police) పోలీసులు పట్టుకున్నారు. డబ్బు ఎవరిది అనే దానిపై విచారిస్తున్నారు.

పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ(Telangana taxes) ఇచ్చేది రూ.100 అయితే.. కేంద్రం నుంచి తిరిగి తెలంగాణకు వచ్చేది రూ.18 మాత్రమే, అలాగే.. కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్తున్న తలసరి పన్నుల వాటా రూ.34,129. అది దేశంలోనే అధికం అని యూనియన్, స్టేట్ బడ్జెట్స్ అనలిస్ట్ అరవింద్ పేర్కొన్నారు.

మళ్లీ వీఆర్వో(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)(Village Revenue Officer) వ్యవస్థను తీసుకొని వస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటన(Tcongress Manifesto).

ఈసారి కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే అని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్(BRS) అధికారంలోకి రాబోతోందని ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసగించారు.

త్రిషపై(Trisha) మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా నిలుస్తానని మాటిచ్చారు.

ఈ దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం(Highest Inflation) ఉన్న రాష్ట్రం తెలంగాణ(Telangana) అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) అన్నారు. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిందని విమర్శించారు.

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(AP Inner Ring Road case) టీడీపీ అధినేత చంద్రబాబు(TDP President Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ తాజాగా వాయిదా పడింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది