Today Top Telugu News : నకిరేకల్ రేవంత్ రెడి సభ ఫ్లాప్.. శాలువా కప్పబోయిన కార్యకర్తపై రేవంత్ ఫైర్.. పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త.. సామాన్యుడిలా మెట్రోలో కేటీఆర్ ప్రయాణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Top Telugu News : నకిరేకల్ రేవంత్ రెడి సభ ఫ్లాప్.. శాలువా కప్పబోయిన కార్యకర్తపై రేవంత్ ఫైర్.. పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త.. సామాన్యుడిలా మెట్రోలో కేటీఆర్ ప్రయాణం

Today Top Telugu News : నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు లేక వెలవెలబోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు కనిపించాయి. నకిరేకల్ సభలో(Nakrekal Meeting) శాలువా కప్పబోయిన కాంగ్రెస్ కార్యకర్తను రేవంత్ రెడ్డి(Revanth Reddy) చీదరించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హుస్నాబాద్ సభ(Husnabad Meeting)లో ఖాళీగా కుర్చీలు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 November 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త

  •  తుంగతుర్తిలో తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

  •  హైదరాబాద్ అభివృద్ధి మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో

Today Top Telugu News : నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు లేక వెలవెలబోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు కనిపించాయి.

నకిరేకల్ సభలో(Nakrekal Meeting) శాలువా కప్పబోయిన కాంగ్రెస్ కార్యకర్తను రేవంత్ రెడ్డి(Revanth Reddy) చీదరించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హుస్నాబాద్ సభ(Husnabad Meeting)లో ఖాళీగా కుర్చీలు. కనిపించని జనం.

సామాన్యుడిలా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ప్రయాణం చేసిన మంత్రి కేటీఆర్(Minister ktr).

హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కునే వారి కోసం కొత్త స్కీమ్ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్(Minister KTR) హామీ ఇచ్చారు.

హైదరాబాద్ అభివృద్ధి(Hyderabad Development) మీద సోషల్ మీడియాలో వీడియో వైరల్

తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి(Thungathurthy congress candidate) మందుల శామ్యూల్(Mandula Shamuel).. చౌళ్ల రామారం(Choulla Ramaram) గ్రామంలో ప్రచారం చేస్తుండగా యువజన నాయకుడు ఖమ్మంపాటి కుమార్ గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఆయన్ను ప్రచార రథం నుంచి మెడలు పట్టి కిందికి నెట్టేశారు. దీంతో కుమార్ స్పృహ తప్పి పడిపోయారు.

2 వారాల కిందనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీద చెప్పుతో దాడి చేస్తానని కాంగ్రెస్ కార్యకర్త హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించారు. కొత్తగూడెంలో నిన్న పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన విషయం తెలిసిందే.

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirwada sabha) వాయిదా పడింది.

తెలంగాణలో పేపర్ ప్రకటన ఇచ్చి అడ్డంగా బుక్ అయిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ(Karnataka Congress Party). మోడల్స్ ను ప్రకటన కోసం వాడుకొని దొరికిపోయిన కాంగ్రెస్.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది