Today Top Telugu News : ఇషాన్ వల్లే మూడో టీ20 ఓటమి.. టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు.. ఎల్బీనగర్లో వెరైటీగా డబ్బుల పంపిణీ.. మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్
Today Top Telugu News : ఇషాన్ కిషన్(Ishan Kishan) తప్పిదం వల్లనే మూడో టీ20(India vs Australia third t20) ఓడిపోయామని టీమిండియా చెబుతోంది. ఎందుకంటే అక్షర్ పటేల్ బౌలింగ్ లో 19.4 వద్ద బంతిని వేసిన మాథ్యూ క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు. కానీ.. బ్యాట్ ను మిస్ అయిన బాల్ వెళ్లి ఇషాన్ చేతుల్లోకి వెళ్లింది. స్టంపింగ్ చేసి అప్పీల్ చేసినా రీప్లేలో నాటౌట్ గా తేలింది. టీమిండియా హెడ్ కోడ్ […]
ప్రధానాంశాలు:
కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
నాంపల్లి దర్గాలో రేవంత్ పూజలు
స్మితా సబర్వాల్ కు నీటి పారుదల శాఖ బాధ్యతలు
Today Top Telugu News : ఇషాన్ కిషన్(Ishan Kishan) తప్పిదం వల్లనే మూడో టీ20(India vs Australia third t20) ఓడిపోయామని టీమిండియా చెబుతోంది. ఎందుకంటే అక్షర్ పటేల్ బౌలింగ్ లో 19.4 వద్ద బంతిని వేసిన మాథ్యూ క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు. కానీ.. బ్యాట్ ను మిస్ అయిన బాల్ వెళ్లి ఇషాన్ చేతుల్లోకి వెళ్లింది. స్టంపింగ్ చేసి అప్పీల్ చేసినా రీప్లేలో నాటౌట్ గా తేలింది.
టీమిండియా హెడ్ కోడ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీ కాలం పొడిగిస్తూ బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం, సహాయక సిబ్బంది కాంట్రాక్ట్ ను కూడా పొడిగిస్తున్నట్టు ప్రకటన
ఎల్బీ నగర్(LB Nagar) లో ఒక పార్టీ అభ్యర్థి ఓటర్లకు(Money distribution to voters) డబ్బులు పంపే విధానం తెలిస్తే మతిపోతుంది. ఎందుకంటే.. ఫోన్ కు వచ్చిన మెసేజ్ చేసుకొని కిరాణ షాపునకు వెళ్లి సరుకులు కావాలని చెబితే వాళ్లు ఒక పొట్లం ఇస్తారు. అందులో డబ్బులు ఉంటాయి. దాన్ని విప్పి డబ్బులు తీసుకుంటున్నారు ఓటర్లు.
మహిళల కోసం కేంద్రం(Central Govt new scheme for Ladies) గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. 2023-24 నుంచి 2025-26 మధ్యకాలంలో 15 వేల స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను కేంద్రం ఇవ్వనుంది.
రేపు తెలంగాణ ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్(Telangan Exit polls 2023) ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన ఆరా సంస్థ
ఫేక్ ఆడియోలు, ఫేక్ న్యూస్ తయారు చేసి రిలీజ్ చేయడానికి సునీల్ కనుగోలు(Sunil kanugolu Team) టీమ్ ప్రయత్నం. కొడంగల్ లో బీఆర్ఎస్ ఓటమి అని కేటీఆర్ అన్నట్టుగా ఫేక్ ఆడియో, ఫేక్ న్యూస్ తయారు చేసిన సునీల్ టీమ్.
ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో తెలంగాణలో ఫేక్ సర్వే హల్ చల్(Intelligence Bureau fake survey in Telangana)
స్మితా సభర్వాల్(Smita Sabarwal) కు నీటిపారుదల శాఖ(Irrigation department) బాధ్యతలను అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ కుమార్ ఉన్నారు. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
కొందరు ఓటర్లకు(Telangana Assembly Election polling) రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక ఓటు, సొంతూరులో ఒక ఓటు ఉంది. దీంతో ఉదయం హైదరాబాద్ లో వేసి, సాయంత్రం ఊరిలో వేయాలని భావిస్తున్నారు. కానీ.. రెండు ఓట్లు ఉన్నా కూడా దగ్గర్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. రెండు ఓట్లు సాధ్యం కావు.
(KTR)కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి(Election Commission) కాంగ్రెస్(Congress) ఫిర్యాదు చేసింది. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదానం చేసి దీక్షా దివాస్ నిర్వహించడానికి కాంగ్రెస్ తప్పుపట్టింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu).. ఇండస్ట్రీకి వచ్చి 44 ఏళ్లు అవుతోంది. 1979 లో నీడ అనే సినిమాలో బాలనటుడిగా తన సినీ కెరీర్ ను మహేశ్ బాబు స్టార్ట్ చేశారు.
తెలంగాణలో రేపు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాంపల్లి దర్గా(Nampally Darga)ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిర్లా మందిర్ ను దర్శించుకున్నారు. ఆరు గ్యారంటీల కార్డుకు రేవంత్ పూజలు చేయించారు.