
malladi krishna rao
ys jagan : సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఐదారు రోజుల ముందు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం, తద్వారా ప్రభుత్వం పడిపోవటం, బలనిరూపణ విషయంలో ఆ పార్టీ నెగ్గకపోవటం, దీనితో వెనువెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించటం జరిగింది. ఇది ఎక్కడో కాదు పుదుచ్చేరి లో ఈ మధ్య జరిగిన వరస సంఘటనలు. వింటుంటే బహుశా సినిమాల్లో కూడా ఇలా జరగదేమో అనిపిస్తుంది. కానీ పుదుచ్చేరి లో మాత్రం ఇదే జరిగింది.
అయితే పుదుచ్చేరి లో ఈ పరిణామాలు జరగటం వెనుక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి హస్తముందాని ఒక ప్రముఖ పత్రిక న్యూస్ ఐటమ్ క్యారీ చేసింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..? తమిళనాడు లో ఎలాగూ అధికారంలో రావటం కష్టమని భావిస్తున్న బీజేపీ ముందు పుదుచ్చేరిలో తమ పెత్తనం సాగించాలని ప్రణాళిక సిద్ధం చేసుకొని జగన్ ను ఉపయోగించి ఆ పని పూర్తిచేయడానికి సిద్దమైనట్లు రాసింది.
తన వీరాభిమాని, పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు (యానాం)తో రాజీనామా చేయించడంతోపాటు మరికొందరి రాజీనామాలకు అవసరమైన ‘వ్యూహాత్మక అస్త్రాలను’ జగన్ సమకూర్చినట్లు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోందని . బీజేపీ పెద్దల నిర్దేశానుసారం జగన్ పావులు కదిపారని, పుదుచ్చేరి సర్కార్ను ఒక పథకం ప్రకారం కూల్చివేశారని భావిస్తోంది. మల్లాడి కృష్ణారావు ద్వారానే ఈ పని పూర్తిచేశారని ఆ పత్రిక చెపుతుంది.
మల్లాడి కృష్ణారావు జనవరి 13న మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ… సాంకేతిక కారణాల వల్ల అది ఆమోదం పొందలేదు. ఇక.. ఫిబ్రవరి 15న ఆయన ఏపీ సీఎం జగన్ను కలిశారు. ఆ భేటీ ముగిసిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించా రు. ఆ తర్వాతే పుదుచ్చేరిలో నారాయణస్వామి సర్కా రు పతనానికి పునాదులు పడ్డాయి. యానాం… పుదుచ్చేరిలో భాగం. కానీ.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉంటుంది. యానాం నుంచి మల్లాడి కృష్ణారావు పలుమార్లు ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు.
మల్లాడి కృష్ణారావుకు సీఎం జగన్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. తాను జగన్కు వీరాభిమానినని, ఆయన అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రకటిస్తుంటారు. ఒకవేళ జగన్ తమిళనాడులో పార్టీ పెడితే కాంగ్రె్సకు రాజీనామా చేసి, జగన్ పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. జగన్ తమిళనాడు సీఎం కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
జగన్ ప్రోద్బలంతోనే మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలో రాజకీయ పావులు కదిపారని. తొలుత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జగన్ను కలిసొచ్చాక ఎమ్మెల్యే పదవికీ మల్లాడి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన ఎమ్మెల్యే బీజేపీ లో చేరారని, కానీ మల్లాది కృష్ణారావు మాత్రం బీజేపీ లో కాకుండా మరో ప్రతిపక్ష పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. దీని వెనుక అమిత్ షా హస్తముందని, ఆయన దగ్గరుండి సీఎం జగన్ ను వాడుకొని మల్లాది కృష్ణారావు ను తమవైపు తిప్పుకొని పుదుచ్చేరిలో రాజకీయ ఎత్తులు వేశారని ఆ పత్రిక రాసుకొచ్చింది.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
This website uses cookies.