YS Jagan : 30 ఇయర్స్ పృథ్వీ తెలుసు కదా. ఆయన విషయం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకోగానే టీటీడీ అధ్యాత్మిక చానెల్ అయిన ఎస్వీబీసీకి చైర్మన్ గా పృథ్వీని నియమించారు. అసలు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఆయనకు ఇవ్వడం ఏంటంటూ అందరూ షాక్ అయ్యారు. కానీ.. చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి కారణం ఓ మహిళా ఉద్యోగిని అని తెలిసింది. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అవడంతో దానిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం.. వెంటనే పృథ్వీని ఆ పదవి నుంచి తప్పించింది.
అప్పటి నుంచి వైఎస్ జగన్ ను కలిసేందుకు పృథ్వీ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పార్టీ నుంచి బయటికి వచ్చేసి జగన్ పై విమర్శలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు తన భార్యకు నెలకు 8 లక్షల రూపాయలు భరణంగా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే.. తనకు సినిమా ఇండస్ట్రీలో పేరు రాగానే తన భార్యను పుట్టింటికి పంపించేశాడట పృథ్వీ. తనకు సినిమా అవకాశాలు రానప్పుడు భార్య సంపాదన మీద బతికి, మామ సంపాదన మీద బతికి ఇప్పుడు వాళ్లను పట్టించుకోకుండా వదిలేశాడని తన భార్య కోర్టుకెక్కింది.
ప్రస్తుతం పృథ్వీ నెలకు రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నాడని, అందుకని తనకు భరణంగా కొంత ఇవ్వాలని తన భార్య కోర్టుకు విన్నవించుకుంది. దీంతో తన భార్యకు నెలకు రూ.8 లక్షల భరణం ఇవ్వాలని పృథ్వీని ఆదేశిస్తుంది కోర్టు. ఏది ఏమైనా అసలు కోర్టు తీర్పు వెలువడ్డాక కానీ.. పృథ్వీ ఏంటో.. అతడి అసలు స్వరూపం ఏంటో బయటపడింది. ప్రస్తుతం పృథ్వీ వైసీపీలో లేడు. జనసేనలో ఉన్నాడు. ఒకవేళ పృథ్వీ జనసేనలో కాకుండా వైసీపీలో ఉండి ఉంటే.. ప్రతిపక్షాలు పృథ్విని కాకుండా సీఎం జగన్ మీదనే విమర్శలు చేసేవారు. ఏది ఏమైనా పృథ్వీ విషయంలో అప్పట్లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అందరూ అంటున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.