yanamala ramakrishnudu : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు, శ్రీ యనమల రామకృష్ణుడు సీఎం జగన్ మోహన్ నిప్పులు చెరిగాడు ఇచ్చింది గోరంత- దోచుకునేది కొండంత అంటూ మాట్లాడాడు. తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, నిత్యావసర సరుకుల ధరల పెంపు వల్ల జగన్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లోనే ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపింది.
ఇసుక ధరలు మూడు రెట్లు పెంచారు. మద్యం క్వార్టర్ పై రూ.100 పెంచారు. పెట్రోల్, డీజిల్ ఒక లీటరుకు రాష్ట్రం అదనంగా రూ.5 పెంచింది. సిమెంట్ బస్తాపై రూ.90 పెంచారు. జగన్ రెడ్డి తెచ్చిన కొత్త ఆస్తిపన్ను చట్టం ప్రకారం ఇప్పుడు ఇంటిపన్ను రూ.10 వేలు చెల్లించే వారు ఏప్రిల్ నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఎడాపెడా ధరలు, పన్నులు, అప్పులు పెంచినా అభివృద్ధి శూన్యమంటూ మాట్లాడాడు.
చంద్రబాబు ఇచ్చిన సంక్షేమం కన్నా తక్కువే ఇచ్చారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, విదేశీ విద్య, పండుగ కానుకల వంటి 34 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ప్రభుత్వానికి పెరిగిన ఆదాయం జే ట్యాక్స్ తో తాడేపల్లి ప్యాలెస్ పరమైంది, వైసీపీ నేతల పరమయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తేనే ఇకపై భారాలు పెంచడానికి భయపడతారు. మున్సిపల్ నిధులు సద్వినియోగం కావాలంటే టీడీపీ అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి అంటూ పిలుపునిచ్చాడు.
రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు రూ.40 నుంచి రూ.67కు పెంచారు. పంచదార రూ.20 నుంచి రూ.34కు పెంచారు. ఎడంచేత్తో ఇచ్చి కుడిచేత్తో రెట్టింపు గుంజుకోవడం జగన్ రెడ్డి సంక్షేమ బండారం కాదా? అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా ఏడాదికి రూ.36 వేలు గుంజుకుంటున్నారు. నాసిరకం మద్యంపై క్వార్టర్ పై రూ.100 పెంచడం వల్ల జే-ట్యాక్స్ ఏడాదికి రూ.5 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతున్నదని వార్తలు వస్తున్నవి. వాహన మిత్ర అంటూ ఎడమ చేత్తో రూ.10 వేలు ఇచ్చి జరిమానాల పేరుతో రూ.20 వేలు గుంజుకుంటున్నారు. 3 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాల పేరుతో 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి రద్దు చేశారంటూ అంటూ యనమల రామకృష్ణుడు ఘాటైన విమర్శలు చేశాడు ,
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.