YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికలే మళ్లీ రిపీట్ అవుతాయని అనుకున్నారా? 2024 లో ఎలాగైనా మళ్లీ వైసీపీ గెలుస్తుందని భావించారా? అందుకే ఆయనకు కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలిసిపోయింది. దీంతో వెంటనే రూట్ మార్చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు ఆ మధ్య. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు బాగానే క్లాస్ పీకారు వైఎస్ జగన్. కొందరు సిట్టింగ్ లకు టికెట్ ఇవ్వను అని నేరుగా ఎమ్మెల్యేలకు చెప్పడం, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చాలామంది గ్రామాల్లో తిరగలేదు అని నేరుగా ఎమ్మెల్యేల సమీక్షలో చెప్పారు. దీంతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును పోగొట్టుకోవాల్సి వచ్చింది.
దీంతో సీఎం జగన్ వెంటనే తన రూట్ మార్చేశారట. అవును.. తన రూట్ మార్చి వెంటనే ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారట. అతిగా ఎమ్మెల్యేలను భయపెడితే వచ్చే ఎన్నికల్లో ప్రాబ్లమ్ అవుతుందని ఆలస్యంగా వైఎస్ జగన్ గుర్తించారు. ఇటీవల నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసిన విషయం తెలిసిందే. దాని వల్ల వైసీపీకి నష్టమే చేకూరింది. ఇలా.. మున్ముందు ఎమ్మెల్యేలపై సీరియస్ అయితే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ చూసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్.. ఇటీవల జరిగిన సమీక్షలో టికెట్లు ఎటూ పోవు.. సిట్టింగ్స్ అందరికీ టికెట్లు వస్తాయి.. అన్నట్టుగా మాట్లాడటంతో ఎమ్మెల్యేలు అంతా షాక్ అయ్యారట.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకొని వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్ల చంద్రబాబు టీడీపీపై ప్రభావం పడిన విషయం తెలుసు కదా. 2024 ఎన్నికల్లో జనసేన వల్ల కూడా అదే నష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు ఈసారి ఎలాగైనా జనసేనతో పోటీ పెట్టుకోవాలని అనుకుంటున్నారట. జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి దెబ్బ పడే ప్రమాదం ఓవైపు ఉండటం, మరోవైపు ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అని సీఎం జగన్ వాళ్లను బుజ్జగించే పనిలో పడ్డారట. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.