
ap YS Jagan cabinet green signal to release amma vodi funds
YS Jagan ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఆగితే 2024 ఎన్నికల హడావిడి మొదలైపోవడం ఖాయం. ఇప్పుడు డిసెంబర్లో కేబినెట్ ప్రక్షాళనకు జగన్
సిద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రాంతాలు, వర్గాలు, రాజకీయాలు, కొత్త, పాత ఇలా వందలాది లెక్కలతో గన్ రాబోయే కేబినెట్ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దం చేసుకోవాలని వైసీపీ
అధినేత కమ్ సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ys jagan is Shock to ministers
ఇందులో భాగంగా ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్త మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులుగా ఎంపిక చేసుకున్న వారందరికీ తమకు ఆ పదవులు రావడానికి కారణమైన పార్టీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత పెట్టనున్నారు. దీంతో మంత్రులకు అప్పగించనున్న పార్టీ బాధ్యతలపైనా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఎవరికే ఏ బాధ్యతలు దక్కనున్నాయి, వాటికి వారు ఏమాత్రం న్యాయంచేస్తారు అనే దానిపైనా చర్చ జరుగుతోంది.
ys jagan is Shock to ministers
మాజీలకు పార్టీ పార్లమెంటరీ జిల్లాల ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ పార్లమెంటరీ జిల్లాల్లో వైసీపీ గెలుపు బాధ్యతల్ని ఈ మంత్రులు తమ భుజాలపై వేసుకుని తదుపరి కార్యక్రమాలు
చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల గెలుపు బాథ్యత వీరిదే. ఇందుకోసం పార్టీకి ఇప్పటికే ఉన్న ప్రాంతీయ ఇన్ ఛార్జ్ ల కన్నుసన్నల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. కేబినెట్ ప్రక్షాళనలో కొత్తగా 25 మంది మంత్రులు రాబోతున్నారు. వీరందరికీ కూడా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. వీరందరికీ తమ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల గెలుపు బాధ్యతను అప్పగించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎంపీల గెలుపు బాధ్యత కాబోయే మంత్రులదే అవుతుంది. దీంతో వీరంతా మంత్రులు కావడం తోటే ఆయా ఎంపీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ 2024లో వీరి గెలుపుకు దోహదపడాల్సి ఉంటుంది. కేబినెట్ ప్రక్షాళనలో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తాజాగా ఎంపీలతో నిర్వహిస్తున్న సమీక్షల్లో జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయా ఎంపీల్ని రేపు 2024 ఎన్నికల్లో గెలిపించాల్సింది వీరే కాబట్టి . వచ్చే ఎన్నికల్లో ఎంపీలు తమను గెలిపించే సత్తా ఉన్న వారినే కాబోయే మంత్రులుగా సిఫార్సుచేయనున్నారట.
ys jagan is Shock to ministers
దీంతో ఈ వ్యవహారం కూడా వైసీపీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రస్తుత మంత్రులు ఎంపీల్ని పట్టించుకోవడం లేదు. చాలా నియోజకవర్గాల్లో వారిని కాలుమోపనీయడం లేదు. ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల ఎంపీల జోక్యాన్ని సహించడం లేదు. దీంతో ఈ సమన్వయం కోసమే ఈసారి ఎంపీలు చెప్పిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతుండటం, వీరి మధ్య విభేధాలు రేపు 2024 ఎన్నికల్లో వైసీపీ పుట్టి ముంచే ప్రమాదముందన్న సంకేతాలు వస్తుండటం, నిఘా, సర్వే నివేదికల నేపథ్యంలో జగన్..
ys jagan is shake to ministers
తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నింటికంటే మించి వచ్చే ఏడాది నుంచి వైసీపీ గెలుపు కోసం మరోసారి రంగంలోకి దిగనున్న ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో విభేధాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న పీకే సలహా మేరకే జగన్ ఈ దిశగా అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Tea : చాలా మందికి టీ అనేది కేవలం పానీయం కాదు, అది రోజువారీ జీవితంలో ఒక భాగం. ఉదయం…
Fenugreek water : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్లు, నిద్రలేమి వంటి కారణాల వల్ల అనేక…
Medak : మెదక్ జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన విద్యార్థి…
OTT Releases : మార్చి నెల వచ్చేసింది అంటే చాలు సినీ ప్రియులకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఫిబ్రవరి వరకు…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. గత ఐదేళ్లుగా…
Lunar Eclipse : 2026 సంవత్సరం మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం భక్తులకు, జ్యోతిష్య విశ్వాసాలను అనుసరించే వారికి ప్రత్యేక…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సాధించిన ఓటు…
Holi Festival : అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి సంతోషంగా జీవించాలనే ఐక్యతా భావాన్ని పంచే రంగుల పండుగ హోలీ…
BR Naidu Video : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు కర్మ సిద్ధాంతం చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.…
Revanth Reddy : తెలంగాణ Telangana లో పరిపాలన వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Cm Revanth reddy…
Bangalore : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనానికి దారి తీసిన హత్యా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెలివిజన్ రంగానికి…
Successful Farmer : చాలా మంది యువత ఉద్యోగాల కోసం మహానగరాల వైపు పరుగులు తీస్తుంటారు. స్థిరమైన జీతం, సౌకర్యవంతమైన…
This website uses cookies.