YS Sharmila : తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో బిజీ అయింది. ఇంకో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమాయాత్తం అవుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కూడా దూకుడు మీదుంది.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రతి రోజూ ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు వైఎస్ షర్మిల. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. దర్యాప్తు వేగంగా చేసి దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డ్ ను రద్దు చేయడం కోసం రాష్ట్రపతికి సిఫారసు చేయాలని, వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేలా చూసి నిరుద్యోగులను ఆదుకోవాలని గవర్నర్ తమిళిసైకి రాసిన లేఖలో షర్మల కోరారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను పేపర్ లీకేజీ వ్యవహారం కుదిపేసిందని.. ఇది అతి పెద్ద స్కామ్ అని లేఖలో పేర్కొన్నారు. సంతలో సరుకులు అమ్మినట్టుగా కీలకమైన పరీక్ష పేపర్లను అమ్మి 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పేపర్ లీకేజీ వెనుక బోర్డ్ చైర్మన్, ఉద్యోగుల నుంచి రాష్ట్ర మంత్రుల హస్తం ఉందంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ పత్రాలు లీక్ కావడం అనేది ఎంత పెద్ద స్కామో తెలుస్తోంది అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.