YS Sharmila : ఢిల్లీలో క‌ప‌ట నాట‌కం ఆడినందుకా.. మ‌ద్దతుపై వైఎస్ ష‌ర్మిళ స్ట‌న్నింగ్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : ఢిల్లీలో క‌ప‌ట నాట‌కం ఆడినందుకా.. మ‌ద్దతుపై వైఎస్ ష‌ర్మిళ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

YS Sharmila : గ‌త కొద్ది రోజులుగా అన్న‌, చెల్లెళ్ల మ‌ధ్య వైరం రాజ‌కీయ వ‌ర్గాలలో చ‌ర్చనీయాంశం అయింది. జ‌గ‌న్ తన చెల్లి ష‌ర్మిళ‌కి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, మ‌రోవైపు ష‌ర్మిళ మాత్రం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధిస్తూనే ఉంది. వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా గురించి.. ఏపీలోని మరో పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : ఢిల్లీలో క‌ప‌ట నాట‌కం ఆడినందుకా.. మ‌ద్దతుపై వైఎస్ ష‌ర్మిళ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

YS Sharmila : గ‌త కొద్ది రోజులుగా అన్న‌, చెల్లెళ్ల మ‌ధ్య వైరం రాజ‌కీయ వ‌ర్గాలలో చ‌ర్చనీయాంశం అయింది. జ‌గ‌న్ తన చెల్లి ష‌ర్మిళ‌కి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, మ‌రోవైపు ష‌ర్మిళ మాత్రం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధిస్తూనే ఉంది. వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా గురించి.. ఏపీలోని మరో పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వినుకొండ హత్య గురించి కూడా వైఎస్ షర్మిల రియాక్టయ్యారు. వినుకొండ రషీద్ హత్యను వ్యక్తిగత హత్యగా పేర్కొన్న షర్మిల.. రాజకీయ హత్యకాదని స్పష్టం చేశారు.

YS Sharmila జ‌గ‌న్‌పై ఫైర్..

వైఎస్ జగన్ హత్యా రాజకీయాలు చేశారన్న వైఎస్ షర్మిల.. సొంత చెల్లెళ్లకు కూడా జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వినుకొండ హత్య మీద ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్న వైఎస్ జగన్.. సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య మీద ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులతో జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇక ఢిల్లీ వేదికగా జగన్ చేపట్టిన దీక్షపై స్పందించారు. తాను చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలోదో సమాధానం చెప్పాలని జగన్ అంటున్నారని… అసలు వైసీపీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ప్రశ్నించారు.  “పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లుగా బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.

YS Sharmila ఢిల్లీలో క‌ప‌ట నాట‌కం ఆడినందుకా మ‌ద్దతుపై వైఎస్ ష‌ర్మిళ స్ట‌న్నింగ్ కామెంట్స్

YS Sharmila : ఢిల్లీలో క‌ప‌ట నాట‌కం ఆడినందుకా.. మ‌ద్దతుపై వైఎస్ ష‌ర్మిళ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?” అని జగన్ ను షర్మిల గ‌ట్టిగా నిల‌దీసింది.. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. “మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు..?” అంటూ వైఎస్ షర్మిల .. జ‌గ‌న్‌ని ఓ రేంజ్‌లో ఏసుకుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది