YSRCP : సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు.. మరి టీడీపీ సంగతేంటి..?
YSRCP : ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. గెలుపు అంచనాలపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే పోలింగ్ కు ముందు తర్వాత కూడా వైసీపీ ఓ లెక్క చెబుతోంది. వైనాట్ 175 అని గర్జిస్తోంది. తమకు కచ్చితంగా 175 సీట్లు వస్తాయని.. ఇది తమ లెక్క అని అంటోంది. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలని సవాల్ విసురుతోంది. అయితే ఇప్పటి వరకు సీట్ల గురించి టీడీపీ ఏ మాత్రం లెక్కలు చెప్పట్లేదు. నారా లోకేష్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారు. కానీ అటు చంద్రబాబు, పవన్ మాత్రం స్పందించట్లేదు.
సరే పార్టీలు అన్న తర్వాత ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ కంటే కాస్త ఎక్కువగానే టీడీపీ పంపకాలు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈసారి కచ్చితంగా గెలవాలనే కసి టీడీపీ కూటమిలో ఉంది. అందుకే ఎలాంటి పనికి అయినా తెగించేసిందని అంటున్నారు. వాస్తవానికి వైసీపీతో పోలిస్తే టీడీపీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటు బ్యాంకు బదిలీ కాలేదని టీడీపీ చెబుతోంది. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీల ఓట్లు తమకు పడలేదని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక వైసీపీ కూడా గెలుపు గట్టి ధీమాతో ఉన్నా సరే ఆ పార్టీకి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎందుకంటే సిట్టింగ్ స్థానాలు చాలా వరకు ఛేంజ్ చేశారు.
YSRCP : సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు.. మరి టీడీపీ సంగతేంటి..?
అంతే కాకుండా ఎన్నికలకు ముందు చాలా మంది మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుకూడా వైసీపీని వీడారు. వారంతా వైసీపీ వ్యతిరేక రాగం ఎత్తుకున్నారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కొంత ఆందోళన ఉంది. అయితే పోలింగ్ నాడు ఓ వేవ్ ఏర్పడిందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నారు. ఆ వేవ్ తమకే ఎక్కువ లాభం చేస్తుందని టీడీపీ భావిస్తోంది. అందుకే గెలుపుపై అంత ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కనీసం 110 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్నారు. చూడాలి మరి టీడీపీ అంచనాలు ఏ మాత్రం నిజం అవుతాయో.
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
This website uses cookies.