YSRCP : విశాఖలో వైసీపీకి షాక్..!
Ysrcp : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వరస రాజీనామాలతో ఆ పార్టీ హై కమాండ్ షాక్ అవుతోంది. ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు. ఏలూరులో పడిన దెబ్బకు వైసీపీకి చెందిన క్యాడర్ అయోమయంలో పడిపోంది. మరోవైపు గోదావరి జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా గట్టిగా ఉంది. ఇక వైసీపీలో చురుకైన నాయకులు ఉన్నా వారంతా ఇపుడు ఇనాక్టివ్ అవుతున్నారు. అక్కడ ఒక సామాజికవర్గం నాయకులు వైసీపీలో ఉంటూ రాజకీయాలు చేయాలనుకున్నా ఆ సామాజిక వర్గం ప్రజల నుంచి కూడా అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. టీడీపీకి కూడా ఇలాంటి సమస్య ఉండాల్సిందే కానీ ఆ పార్టీ కూటమిలో మిత్రుడిగా ఉంది. పైగా అధికారంలో ఉంది. దాంతో వైసీపీ లీడర్ల మీదనే ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ అవుతోంది అని అంటున్నారు.
దాంతో వారు తాము అనుకున్న పార్టీలో రాజకీయం చేయలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. వీటికి తోడు చాలా ఆకర్షణలు అధికారాలు ఇవన్నీ కూడా బలంగా పనిచేయడంతో వైసీపీ గోదావరి జిల్లాలో అల్లాడిపోతోంది. ఆ పార్టీ అక్కడ నిలిచి నిలదొక్కుకోవడం మాత్రం టఫ్ జాబ్ గా మారేలా ఉంది. జనసేన అధికారంలో భాగం కావడంతో జనసేన అధినేత పవన్ అప్పట్లో పిలుపు ఇచ్చినట్లుగా గోదావరి జిల్లాల నుంచి వైసీపీని లేకుండా చేసే కార్యక్రమం అయితే సాగుతోంది. దీనిని తట్టుకుంటూ ముందుకు సాగే మార్గాలను అయితే వైసీపీ అన్వేషించలేకపోవడం కొసమెరుపు. అయితే కూటమి మీద వారి పాలన మీద కొంత వ్యతిరేకత రావాలి. అప్పటిదాకా గోదావరిలో ఈ ఒడుదుడుకులు ఎదుర్కొంటూ వైసీపీ ఎదురీత ఈదాల్సిందే అని అంటున్నారు.
Ysrcp : గోదారోళ్ల దెబ్బకు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని, ఆయన నేతృత్వంలోనే పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని, త్వరలోనే జనసేనలో చేరుతామని ఘంటా పద్మశ్రీ వివరించారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మొత్తం ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ కోసం భజన చెయ్యడానికి నాయకులు కరువు అయ్యారని తెలుస్తుంది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.