Ayodhya Ram Mandir History : అయోధ్య రామ మందిరం వివాదం ఎందుకు మొద‌లైంది.. ఈ స్థ‌లం వెనుక ఉన్న చ‌రిత్ర ఎంటో తెలుసా..?

Advertisement
Advertisement

Ayodhya Ram Mandir History : ఉత్తర భారత దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ జిల్లాలో ఉన్న అయోధ్య శ్రీరాముడి జన్మభూమి. అయోధ్యలో శ్రీరాముడు జనవరి 10, 5114BC లో శుక్లపక్షంలో చైత్రమాసంలో జన్మించారు. అంటే దాదాపుగా రాముడు పుట్టి 7123 సంవత్సరాలు అవుతుంది. ఇక రాముడు తన అవతారాన్ని విడిచి వైకుంఠానికి చేరుకున్న తర్వాత అక్కడి ప్రజలు శ్రీరాముడికి గుర్తుగాను అయోధ్యలో గుడి కట్టి పూజలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1528 – 1529 మధ్యలో బాపూర్ అనే నవాబు రాజు అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీదును కట్టించారు. దీంతో హిందువులకు, ముస్లింలకు ఎన్నో గొడవలు జరిగాయి. అయితే అక్కడ విశ్వహిందూ పరిషద్ అనే మూడు వర్గాలకు చెందిన వారు ఉండేవారు. అక్కడ ఉండే వీరు హిందూస్ ని రిప్రజెంట్ చేసేవారు. యూపీషి సెంట్రల్ వాక్ బోర్డ్ అనేవారు అక్కడి ముస్లింలను రిప్రజెంట్ చేసేవారు. నిర్మోహి అఖర అనే వీరు గుళ్లో పనిచేసే పూజారులను రిప్రజెంట్ చేసేవారు. ఇక ఇక్కడ ఉండే బాబ్రీ మసీద్ 2.77 ఎకరాల స్థలంలో ఉండేది. అయితే ఆ స్థలం ముస్లింలకు చెందినదని, ఆ స్థలాన్ని హిందువులు దోచుకొని రామ మందిరాన్ని కట్టారని, అంతే కాకుండా అది రాముడి జన్మభూమి అనడానికి బలమైన సాక్షాలు లేవని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు.

Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?

1957లో నవాబులకు బ్రిటిష్ వాళ్లకి పెద్ద యుద్ధం జరిగింది. చివరికి ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచారు. దాంతో నవాబుల పాలన ముగిసింది. నవాబులు ముస్లిమ్స్ కావడంతో హిందువులు రాముడి జన్మభూమి అయోధ్య అని ఎన్ని గొడవలు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ముస్లింలకు, హిందువులకు గొడవలు జరిగాయి. అక్కడికి మసీదు అధికారి అయిన మహమ్మద్ అజ్గర్ బ్రిటిష్ వాళ్లకు కంప్లైంట్ చేశారు. రెండోసారి నిర్మోహి అఖర అనే సంస్థ 1983లో ఆలయం నిర్మాణం కోసం అనుమతి కోరుతూ డిప్యూటీ కమిషనర్ కు అప్లికేషన్ ఇచ్చారు. కానీ ముస్లింలు అందుకు అంగీకరించనివ్వకుండా గొడవలు చేశారు. మే 1983లో లాహోరికి చెందిన గురు సింగ్ అనే పంజాబీ వ్యక్తి రాళ్లు ఇతర నిర్మాణ వస్తువులతో పాటు అయోధ్యకి వచ్చి రాముడికి మందిరం కట్టాలని నిరసనలు తెలిపాడు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

1985లో నిర్మోహి అఖర సంస్థకి చెందిన మహంత్ర వరుదాస్ అనే వ్యక్తి అది రాముడి జన్మభూమి అని ఖచ్చితంగా రామ మందిరాన్ని కట్టి తీరాలని సివిల్ కోర్టులో మొట్టమొదటిసారి పిటీషన్ వేశారు. అయితే మసీదును కూల్చేసి అక్కడ మందిరం కడితే ముస్లింలకు హిందువులకు గొడవలు వస్తాయని కేసును కొట్టివేశారు. తర్వాత రెండోసారి అక్కడి జిల్లాలో కేసును రీఓపెన్ చేశారు. అయోధ్య రాముడు జన్మభూమి రామ మందిరాన్ని కూల్చేసి మసీదుని కట్టడం చాలా బాధాకరమని, అది జరిగి అప్పటికే 230 సంవత్సరాలు అయిందని, పాత కేసుకు సమన్వయం చెప్పడం తీర్పు కాదని, మళ్లీ మరోసారి కేసును డిస్మిస్ చేశారు. కానీ మసీదును కూల్చడానికి అనుమతి ఇవ్వలేం కానీ మసీదు బయట ఉన్న ఎత్తైన ఫ్లాట్ఫామ్ మీద హిందువులు పూజ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో హిందువులు చెక్కతో తయారుచేసిన సీతారాముల విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మసీదు లోపల ముస్లింలు బయట హిందువులు పూజ చేసుకునేవారు.

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?

అయితే 1949లో కొంతమంది హిందువులు రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా మసీదు లోపల చొరబడి సీతారాముల విగ్రహాన్ని పెట్టారు. మరుసటి రోజు అది చూసిన ముస్లింలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాంతో హిందువులకు ముస్లింలకు గొడవలు జరుగుతున్నాయని మసీదును, ఫ్లాట్ఫామ్ పై ఉన్న రాముడు గోపురాన్ని లాక్ చేసి క్లోజ్ చేశారు. 1986లో విశ్వహిందూ పరిషత్ సంస్థ చెందిన వారు అక్కడ హిందువులకు పూజలు చేసుకునే పర్మిషన్ ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు కోర్టు ఒప్పుకోవడంతో 37 సంవత్సరాల తర్వాత గుడి గేట్లు తెరిచాయి. ఇదే మంచి సమయం అని భావించిన సంస్థ ఆ ల్యాండ్ కూడా మాకే ఇవ్వండి అని, ఇక్కడ గుడి కట్టుకుంటామని డిమాండ్ చేశారు. మిగిలిన సంస్థలు కూడా భూమి వారిదే అని డిమాండ్ చేశాయి.

Ayodhya Ram Mandir : అయోధ్య‌పురిలో కొలువుదీరిన బాల‌రాముడు.. లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?

విశ్వహిందూ పరిషత్ సంస్థకి పొలిటికల్గా బీజేపీ ఎంతో మద్దతు ఇచ్చింది. 1992లో విశ్వహిందూ పరిషత్ బీజేపీ కలిసి 2.77 ఎకరాల చుట్టూ పెద్ద మహాసభను ఏర్పాటు చేశారు. ఆ సభకు దేశ నలమూలనుంచి పెద్ద ఎత్తున హిందువులొచ్చారు. ఎల్కే అద్వానీ, వాజ్ పేయి వంటి వారు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వారు వెళ్లిన తర్వాత కొందరు మసీదు పైకెక్కి జైశ్రీరామ్ అంటూ మసీదును పగలగొట్టడం మొదలుపెట్టారు. అలా మసీదు మొత్తాన్ని కూల్చేసి చివరికి చిన్న గుడిని కట్టారు. ఆ గొడవలు దాదాపుగా 10వేల నుంచి 15 వేల మంది చనిపోయారు. ఇక ఆ తర్వాత 2010లో అలహాబాద్ కోర్టు 2.77 ఎకరాల స్థలాన్ని మూడు ఆర్గనైజేషన్లు సమానంగా పంచుకోమని చెప్పింది. కానీ అది ఎవరికీ నచ్చకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆ 2.77 ఎకరాల స్థలం ఎవరిదో ఆధారాలు చూపిస్తే వారికి స్థలం అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ జరిపించింది. 1717 లో రాజ్ పుత్ వంశానికి చెందిన జై సింగ్ అనే రాజు 2.77 ఎకరాల భూమిని కొని శ్రీరాముడు పేరు మీద రాశాడని ఆధారం దొరికింది. దీంతో చివరికి 2019లో ఈ స్థలం హిందువులకే చెందుతుందని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. దీంతో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న గొడవలు తీరిపోయాయి. ఫైనల్ గా శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది.

Advertisement
Advertisement

Recent Posts

Dates vs Almonds : ఖర్జూరం vs బాదం ఆరోగ్యానికి ఏది మంచింది.. ఏది మీకు ఎక్కువ ప్రయోజనం తెలుసా ?

Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…

10 minutes ago

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

1 hour ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

9 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

10 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

10 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

11 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

12 hours ago