
Afghanistan : సెమీస్కి చేరిన ఆఫ్ఘనిస్తాన్.. బీసీసీఐకి తాలిబన్ల మెసేజ్
Afghanistan : టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేసింది. లీగ్ మ్యాచ్లలోనే ఇంటి దారి పడుతుంది అనుకుంటే ఏకంగా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన టీమ్ని కూడా మట్టి కరిపించింది. సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్స్లో అడుగుపెట్టింది.. దర్జాగా. దీని దెబ్బకు ఆస్ట్రేలియాకు సెమీస్ దారులు మూసుకుపోయాయి. గత మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు గానూ 114 పరుగుల టార్గెట్ ను నిర్ణయించాడు. 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ కావడంతో 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అనేక మలుపులు, నాటకాలు కనిపించాయి. పలుమార్లు వర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. చిరు జల్లుల పడుతున్న సమయంలోనూ మ్యాచ్ సాగింది. ఎట్టకేలకి ఆఫ్ఘనిస్తాన్ గెలిచి సెమీస్ చేరుకుంది. కేప్టెన్ రషీద్ ఖాన్, నవీనుల్ హక్ నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. గులబ్బదీన్ నబీ, ఫజల్ హక్ ఫారూఖీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టయింది ఆఫ్ఘనిస్తాన్. టీమిండియా ఇప్పటికే సెమీ ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనలతో సతమతం అవుతున్న వారు ఆ బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు.
Afghanistan : సెమీస్కి చేరిన ఆఫ్ఘనిస్తాన్.. బీసీసీఐకి తాలిబన్ల మెసేజ్
ఇదే తరుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది . భారత్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం అంటూ తాలిబన్ గవర్న్మెంట్ పొలిటికల్ హెడ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. అయితే బీసీసీఐ.. వాళ్లు అడిగిన వెంటనే అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు చాలా అండగా నిలిచింది. ఈక్రమంలోనే వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆఫ్ఘాన్కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
This website uses cookies.