Semi Final Match : సెమీస్లో తలపడనున్న భారత్ - ఇంగ్లండ్.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ వెళ్లేదెవరు..!
Semi Final Match : టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 మ్యాచ్లు ముగియడంతో సెమీఫైనల్ రేసు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-1 నుంచి ఏ జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుందా అనే ఉత్కంఠ నడుమ అఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాపై గెలిచి సెమీస్ కి వెళ్లింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లింది. దీంతో 2022 టీ20 వరల్డ్ కప్ సీన్ రిపీట్ అయింది. అప్పుడు భారత్పై ఇంగ్లాండ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కి వెళ్లింది. ప్రస్తుత టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమ్ ఇండియా, ఇంగ్లీష్ టీమ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
జూన్ 27న భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 28న ఫైనల్ జరగనుంది. ఇంగ్లండ్ చివరిసారిగా సెమీ ఫైనల్స్లో టీమిండియాను ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం భారత్కు దక్కింది. కాని ఇంగ్లండ్ జట్టు భీబత్సంగా ఆడుతుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు మోన్స్టర్స్లా చెలరేగిపోతున్నారు. ఒమన్పై 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించింది. అమెరికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లోనూ 116 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే అందుకుంది. ఇప్పుడు ఆ డేంజరస్ ఇంగ్లండ్ను భారత్ సెమీస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సెమీస్ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ వర్షం వలన సెమీస్ మ్యాచ్ రద్దైతే ఫైనల్కి ఎవరు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది.
Semi Final Match : సెమీస్లో తలపడనున్న భారత్ – ఇంగ్లండ్.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ వెళ్లేదెవరు..!
ఒక్క బంతి కూడా వేయకుండానే గేమ్ వాష్ అవుట్ అయితే, సూపర్ 8 స్టేజ్లో గ్రూప్లో టాప్ పొజిషన్లో ఉన్న భారత్ నేరుగా టీ20 ప్రపంచకప్లో ఫైనల్స్కు చేరే అవకాశం. మ్యాచ్ పూర్తిగా జరగకపోతే ఇండియా జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రినిడాడ్లో జూన్ 26న జరిగే మొదటి సెమీస్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. ఈ మ్యాచ్ నైట్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ మ్యాచ్ క్యాన్సిల్ అయితే, తర్వాతి రోజు డే టైమ్లో గేమ్ జరుగుతుంది. అయితే గయానాలో జూన్ 27న జరిగే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెంఓ సెమీస్ ఉదయం జరుగుతుంది. దానికి రిజర్వ్ డే లేదు. వాష్ అవుట్ అయితే రిజల్ట్ అనౌన్స్ చేయడానికి 2.30 గంటల ఎక్స్ట్రా టైమ్ తీసుకుంటారు. ఆ లోపు మ్యాచ్ నిర్వహించలేకపోతే, క్యాన్సిల్ అయినట్లు ప్రకటిస్తారు. దాంతో భారత్ ఫైనల్కి చేరుకోవడం ఖాయం. మ్యాచ్ పూర్తిగా రద్దైతే జూన్ 29న శనివారం బార్బడోస్లో జరిగే ఫైనల్కి భారత్ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.