
ipl 2022 auction shreyas iyer most expensive
IPL 2022 Auction : ఎప్పుడా ఎన్నడా అంటూ అభిమానులు అందరు ఎదురు చూసిన ఐపీఎల్ మెగా వేలం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు కొందరు వేలంలోకి రాగా, రేపు మరి కొందరిని తీసుకోనున్నారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ముందుగా వేలంలోకి వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్ను కొనుగోలు చేసింది.టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకి వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. వేలంలో అతడిని రాజస్తాన్ రాయల్స్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ కోసం కేకేఆర్, రాజస్తాన్ పోటీ పడ్డాయి. చివరకి రాజస్తాన్ ప్రసిద్ధ్ కృష్ణను కైవసం చేసుకుంది.
ipl 2022 auction shreyas iyer most expensive
కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ను సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. SRH పూరన్ కోసం బిడ్డింగ్ను ప్రారంభించింది. దానిని 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. KKR – CSK వెనుకబడిపోయింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. రూ. 10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. మిండియా సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేయగా.. ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది.
టీమిండియా యువ బౌలర్ హర్షల్ పటేల్కు బంపర్ ఆఫర్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్ను ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఆర్సీబీ తరపున 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్పై నమ్మకముంచిన ఆర్సీబీ మరోసారి కొనుగోలు చేసింది.
టాప్- 10: ఎవరెవరు ఎంతకు అమ్ముడుపోయారంటే!
1.శిఖర్ ధావన్: రూ. 8.25 కోట్లు- పంజాబ్ కింగ్స్
2.రవిచంద్రన్ అశ్విన్: 5 కోట్లు- రాజస్తాన్ రాయల్స్
3.ప్యాట్ కమిన్స్: 7.25 కోట్లు- కోల్కతా నైట్రైడర్స్
4.కగిసో రబడ: 9.25 కోట్లు- పంజాబ్ కింగ్స్
5.ట్రెంట్ బౌల్ట్: 8 కోట్లు- రాజస్తాన్ రాయల్స్
6. శ్రేయస్ అయ్యర్: 12.25 కోట్లు- కోల్కతా నైట్రైడర్స్
7. మహ్మద్ షమీ- 6.25 కోట్లు- గుజరాత్ టైటాన్స్
8. ఫాఫ్ డుప్లెసిస్- 7 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)
9. క్వింటన్ డికాక్- 6.75 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
10. డేవిడ్ వార్నర్- 6.25 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.