IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :10 May 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..!

IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌లు ఎప్పుడు జ‌రుగుతాయి, ఎక్క‌డ జ‌రుగుతాయి అన్న దానిపై అంద‌రిలో సందేహాలు నెల‌కొన్నాయి. ఇదిలా ఉండగా, టోర్నమెంట్ ప్రారంభానికి సంబంధించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడు ఒక పెద్ద ప్రకటన చేశారు.

IPL 2025 యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌ తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే

IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..!

IPL 2025 : తిరిగి ఎప్పుడంటే..

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఐపీఎల్ 2025 ప్రస్తుతం ఒక వారం వాయిదా పడుతోందని అన్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత, భారత ప్రభుత్వంతో సంప్రదించి, భాగస్వాములు, అన్ని ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలతో మాట్లాడిన తర్వాత, కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన అన్నారు.

గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోగా,ఆ రోజు ఒకవైపు అభిమానులను మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఆటగాళ్లను వీలైనంత త్వరగా వారి హోటళ్లకు తిరిగి పంపించారు. తరువాత, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమల్ మాట్లాడుతూ, మైదానంలో తొక్కిసలాట లాంటి సంఘటనను నివారించడానికి విద్యుత్తు అంతరాయం మరియు ఫ్లడ్‌లైట్ వైఫల్యాన్ని ఒక సాకుగా ఉపయోగించుకున్నారని వెల్లడించారు.ఈ సీజ‌న్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు జరిగాయి. అయితే పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం లేదు.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది