IPL : ధనాధన్ బ్యాటింగ్ తో నిప్పులు చెరిగే బౌలింగ్తో క్రికెట్ ప్రియులకి ఐపీఎల్ మంచి వినోదాన్ని పంచుతుందనే విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 వేలం గత వారం ముగియగా.. ఇప్పుడు 15వ సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఐపీఎల్ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.గత రెండు సంవత్సరాలు కరోనా వలన విదేశాలలో మ్యాచ్లు నిర్వహించగా, ఈ సారి ఇండియాలోని ఆరు ప్రాంతాలలో జరిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తాజా సీజన్ మార్చ్ 27, 2022న ప్రారంభం అవుతుందని సమాచారం.
ఫైనల్స్ మే 28, 2022న నిర్వహించేందుకు బోర్డు ఏర్పట్లు చేస్తోంది. ఇక ఐపీఎల్ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.గత సీజన్లతో పోలిస్తే.. ఈ సారి ఐపీఎల్కు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ సారి ఐపీఎల్లో మొత్తం 10 టీమ్స్ పాల్గొననున్నాయి. దీనితో సీజన్ మొత్తం మీద 74 మ్యాచ్లు జరగనున్నాయి.అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 గ్రౌండ్లలో జరిగే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు, ప్లేఆఫ్ మ్యాచ్లు అహ్మదాబాద్లో జరుగుతాయి. ముంబైలో జరిగే అన్ని మ్యాచ్లు వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియంలలో జరిగే అవకాశం ఉంది.
టోర్నీ షెడ్యూల్ను ఫిబ్రవరి చివరి వారంలో బీసీసీఐ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కరోనా తగ్గినా కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కట్టుదిట్టమైన బయోబబుల్ నిబంధనల నడుమ దేశీయంగానే ఐపీఎల్ 2022 నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశీయంగానే ఐపీఎల్ 2022 ఉంటుందని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. ఇతర విషయాలపై మాత్రం ఇంకా స్పందించలేదు. ఆ సారి ఐపీఎల్ మార్చి 27 నుంచి 28 వరకు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.