
MS Dhoni is going to captain of Team India
MS Dhoni : మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్పులను అందించిన ఘనత ఆయనదే. రెండు వరల్డ్ కప్పులను భారత్ కు అందించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పి కేవలం ఐపీఎల్ లో మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు ధోనీ. అలాగే ఈ మధ్య కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసిన ధోనీ.. తన వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నాడు. ఈనేపథ్యంలో ధోనీ గురించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది భారత జట్టులో మళ్లీ ధోనీ ఆడబోతున్నాడని.
బీసీసీఐనే ధోనీని మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలని అనుకుంటోందట. దానికి కారణం.. ప్రస్తుతం భారత జట్టు పేలవ ప్రదర్శన అని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022 లో భారత్ సెమీస్ నుంచే వెనుదిరిగిన విషయం తెలిసిందే. కేవలం పాకిస్థాన్ మీద మాత్రమే గెలిచిన టీమిండియా ఆ తర్వాత అంతగా ఆడింది లేదు. సెమీస్ వరకు చేరుకున్నా.. చివరకు ఇంగ్లండ్ చేతుల్లో దారుణంగా ఓటమి పాలయింది భారత్. MS Dhoni : భారత జట్టులో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైన బీసీసీఐ 2011 లో ఐసీసీ ట్రోఫీని గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఒక్క ట్రోఫీని కూడా టీమిండియా గెలుచుకోలేకపోయింది. 2011 లో ధోనీ పుణ్యమాని ఐసీసీ ట్రోఫీని ఇండియా గెలుచుకోగలిగింది.
MS Dhoni is going to captain of Team India
ఈ 11 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ట్రోఫీని కూడా టీమిండియా గెలుచుకోలేకపోవడంతో భారత జట్టులో సమూల మార్పులు చేయడమే బెటర్ అని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ధోనీని జట్టులోకి తీసుకొని మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడించాలని భావిస్తోంది. 2023 తర్వాత ధోనీని ఐపీఎల్ నుంచి తప్పించి టీమిండియాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్ల ఫిట్ నెస్ ను కూడా చూసుకోవడం కోసం ధోనీనే నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. పూర్తిస్థాయిలో టీమిండియా బాధ్యతలను ధోనీకే అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. దానికి సంబంధించి ధోనీతో కూడా బీసీసీఐ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ధోనీ సారథ్యంలో అయినా టీమిండియా ఆటతీరు మారుతుందేమో?
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
This website uses cookies.