Cricket Stadium : ఇండియా మ్యాచ్లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!
Cricket Stadium : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్2న ఈ టోర్నమెంట్ మొదలు కాగా, ప్రతి మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. కొన్ని టీమ్స్ ఇప్పటికే సూపర్8కి చేరుకోగా, మరి కొన్ని రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుకుంటే అందరికి డిస్కషన్ పాయింట్గా మారుతుంది నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్లలో చాలా లోస్కోర్ టోటల్స్ నమోదయ్యాయి. క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాన్ని కూడా నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు.
ఈ స్టేడియంలో మహామహా టీమ్స్ క్రికెట్ ఆడగా, అవి కూడా చాలా స్కోరు టోటల్ చేశాయి. కనీసం 150 పరుగులు కూడా సదరు టీమ్స్ చేయలేకపోతుండడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఈ నస్సావ్ కౌంటీ న్యూయార్క్ స్టేడియంని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అంతేకాకుండా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో ఈ స్టేడియం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా నిలిచింది. ఈ స్టేడియంపై బాగా నెగెటివిటీ పెరగడంతో ఈ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
Cricket Stadium : ఇండియా మ్యాచ్లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!
రూ.250 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం కాగా, అందుకు కారణంగా ఆ స్టేడియం వచ్చిన నెగెటివిటీనే కారణంగా చెబుతున్నారు. పిచ్ని మార్చుకోవడానికి వీలు ఉంటుంది. కాని ఔట్ ఫీల్డ్ కూడా చాలా మందకొడిగా ఉండడంతో స్టేడియం మొత్తాన్ని మార్చడం కష్టం కాబట్టి.. కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో కేవలం టీమిండియా- పాక్ మ్యాచ్ కే రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని కాబట్టి వారికి ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.చూడాలి మరి రానున్న రోజులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మరి..
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
This website uses cookies.