
richard kettleborough named for on field umpire for india vs australia final
India vs Australia : అయ్యో.. ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మనదే అని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఓవైపు సంబురాలు చేసుకుంటూ ఉంటే.. మరోవైపు ఫైనల్ మ్యాచ్ ఇంకా జరగకముందే పెద్ద బాంబు పేలినంత పని అయింది. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ షాకింగ్ ఏంటో తెలుసా? అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. వామ్మో.. ఈయన పేరు ఎత్తితేనే భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్వెత్తున లేస్తారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ అంపైర్ భారత్ కు శని అనే చెప్పుకోవాలి. ఆయన అంపైర్ గా ఉన్న ఏ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ భారత్ గెలవలేదు. ఇప్పటి వరకు అలాంటి దాఖలాలే లేవు. కానీ.. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగబోయే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఈ రిచర్డ్ కెటిల్ బరో, రిచర్ ఇల్లింగ్ వర్త్ ను కన్ఫమ్ చేశారు. 2015 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ కెటిల్ బరోనే అంపైర్ గా ఉన్నాడు.
ఆన్ ఫీల్డ్ లో వీళ్లు అంపైర్స్ కాగా, థర్డ్ అంపైర్ గా జొయెల్ విల్సన్, నాలుగో అంపైర్ గా క్రిస్ గఫ్పనే(న్యూజిలాండ్), మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(జింబాబ్వే) ఉండనున్నారు. వీళ్లంతా సెమీ ఫైనల్స్ లోనూ అంపైర్స్ గా వ్యవహరించారు. ఫైనల్ మ్యాచ్ కోసం ఈ అంపైర్స్ ను తాజాగా ఐసీసీ సెలెక్ట్ చేసింది. న్యూజిలాండ్ తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడినప్పుడు ఇల్లింగ్ వర్త్ అంపైర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ మ్యాచ్ కు కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు ఇద్దరిని ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఐసీసీ నియమించింది. అయితే.. భారత్ కు శనిగా పట్టుకున్న రిచర్డ్ కెటిల్ బరో ఫైనల్ కు అంపైర్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్.. కెటిల్ బరో అంపైర్ గా ఉన్నప్పుడే ఓడిపోయింది. అంతే కాదు.. 2014 వరల్డ్ కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ లోనూ కెటిల్ బరోనే అంపైర్. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. 2016 వరల్డ్ కప్ టీ20 సెమీ ఫైనల్, 2017 సీటీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లన్నీంటికీ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు కూడా ఈయనే సెలెక్ట్ అవడంతో ఫైనల్ మ్యాచ్ ఏమౌతుందో అని అంతా టెన్షన్ గా చూస్తున్నారు. భారత్ కు ఐరన్ లెగ్ అంపైర్ గా పేరు తెచ్చుకున్న ఈయన్ను ఎందుకు ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా సెలెక్ట్ చేసిందో.. ఈయన వల్ల ఈ సారి కప్పు చేజారుతుందా? లేక.. ఆ శనిదేవుడి సెంటిమెంట్ ను ఈసారి భారత్ పక్కన పెడుతుందా? అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.