
richard kettleborough named for on field umpire for india vs australia final
India vs Australia : అయ్యో.. ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మనదే అని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఓవైపు సంబురాలు చేసుకుంటూ ఉంటే.. మరోవైపు ఫైనల్ మ్యాచ్ ఇంకా జరగకముందే పెద్ద బాంబు పేలినంత పని అయింది. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ షాకింగ్ ఏంటో తెలుసా? అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. వామ్మో.. ఈయన పేరు ఎత్తితేనే భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్వెత్తున లేస్తారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ అంపైర్ భారత్ కు శని అనే చెప్పుకోవాలి. ఆయన అంపైర్ గా ఉన్న ఏ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ భారత్ గెలవలేదు. ఇప్పటి వరకు అలాంటి దాఖలాలే లేవు. కానీ.. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగబోయే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఈ రిచర్డ్ కెటిల్ బరో, రిచర్ ఇల్లింగ్ వర్త్ ను కన్ఫమ్ చేశారు. 2015 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ కెటిల్ బరోనే అంపైర్ గా ఉన్నాడు.
ఆన్ ఫీల్డ్ లో వీళ్లు అంపైర్స్ కాగా, థర్డ్ అంపైర్ గా జొయెల్ విల్సన్, నాలుగో అంపైర్ గా క్రిస్ గఫ్పనే(న్యూజిలాండ్), మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(జింబాబ్వే) ఉండనున్నారు. వీళ్లంతా సెమీ ఫైనల్స్ లోనూ అంపైర్స్ గా వ్యవహరించారు. ఫైనల్ మ్యాచ్ కోసం ఈ అంపైర్స్ ను తాజాగా ఐసీసీ సెలెక్ట్ చేసింది. న్యూజిలాండ్ తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడినప్పుడు ఇల్లింగ్ వర్త్ అంపైర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ మ్యాచ్ కు కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు ఇద్దరిని ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఐసీసీ నియమించింది. అయితే.. భారత్ కు శనిగా పట్టుకున్న రిచర్డ్ కెటిల్ బరో ఫైనల్ కు అంపైర్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్.. కెటిల్ బరో అంపైర్ గా ఉన్నప్పుడే ఓడిపోయింది. అంతే కాదు.. 2014 వరల్డ్ కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ లోనూ కెటిల్ బరోనే అంపైర్. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. 2016 వరల్డ్ కప్ టీ20 సెమీ ఫైనల్, 2017 సీటీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లన్నీంటికీ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు కూడా ఈయనే సెలెక్ట్ అవడంతో ఫైనల్ మ్యాచ్ ఏమౌతుందో అని అంతా టెన్షన్ గా చూస్తున్నారు. భారత్ కు ఐరన్ లెగ్ అంపైర్ గా పేరు తెచ్చుకున్న ఈయన్ను ఎందుకు ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా సెలెక్ట్ చేసిందో.. ఈయన వల్ల ఈ సారి కప్పు చేజారుతుందా? లేక.. ఆ శనిదేవుడి సెంటిమెంట్ ను ఈసారి భారత్ పక్కన పెడుతుందా? అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
This website uses cookies.