World Cup Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం భారతీయులలో ఉత్కంఠత నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాగే కొందరు భారత్ కి వరల్డ్ కప్ రావాలని పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా వరల్డ్ కప్ గురించి కీలక కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ .. 2023 ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్ కచ్చితంగా గెలుస్తుంది. రోహిత్ శర్మ సారధ్యంలో మన ఇండియా వరల్డ్ కప్ కొట్టబోతుంది. ఈ వరల్డ్ కప్ లో మన టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీద విజయం సాధించి 20 ఏళ్లుగా ఉన్న రివేంజ్ ని భారత్ తీర్చుకోబోతుంది. ఇందులో సందేహమే లేదు. 165 కోట్ల భారతీయులంతా భారత్ టీం కోసం ప్రార్థనలు చేయమని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . ఎందుకంటే మనం 12 ఏళ్లుగా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నాం.
1983 , 2011 తర్వాత మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలవబోతున్నాం. భారత్ టీం కి ఆల్ ద బెస్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అహ్మదాబాద్ కి వెళ్లారు. భారత అభిమానులు భారీగా రావడంతో నరేంద్ర మోడీ స్టేడియం బ్లూ సీ గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో పటిష్టంగా ఉన్న భారత్-ఆస్ట్రేలియా పోటీపడుతుండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.