World Cup Final 2023 : ఆస్ట్రేలియా టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చిన రోజా ...!
World Cup Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం భారతీయులలో ఉత్కంఠత నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాగే కొందరు భారత్ కి వరల్డ్ కప్ రావాలని పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా వరల్డ్ కప్ గురించి కీలక కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ .. 2023 ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్ కచ్చితంగా గెలుస్తుంది. రోహిత్ శర్మ సారధ్యంలో మన ఇండియా వరల్డ్ కప్ కొట్టబోతుంది. ఈ వరల్డ్ కప్ లో మన టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీద విజయం సాధించి 20 ఏళ్లుగా ఉన్న రివేంజ్ ని భారత్ తీర్చుకోబోతుంది. ఇందులో సందేహమే లేదు. 165 కోట్ల భారతీయులంతా భారత్ టీం కోసం ప్రార్థనలు చేయమని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . ఎందుకంటే మనం 12 ఏళ్లుగా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నాం.
1983 , 2011 తర్వాత మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలవబోతున్నాం. భారత్ టీం కి ఆల్ ద బెస్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అహ్మదాబాద్ కి వెళ్లారు. భారత అభిమానులు భారీగా రావడంతో నరేంద్ర మోడీ స్టేడియం బ్లూ సీ గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో పటిష్టంగా ఉన్న భారత్-ఆస్ట్రేలియా పోటీపడుతుండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.