
#image_title
ODI World Cup 2023 : క్రికెట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకు క్రికెట్ గురించి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఇటీవలే ఆసియా కప్ పూర్తయిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో గెలిచిన ఉత్సాహంతో ప్రస్తుతం భారత్.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం ఎదురు చూస్తోంది. వన్ డే ప్రపంచకప్ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ లు ఒక ఎత్తు అయితే.. ఈ ప్రపంచకప్ మరోవైపు. ఎందకంటే.. ఈసారి ప్రపంచకప్ లో చాలా నిబంధనలు మారాయి. సరికొత్త నిబంధనలను ఐసీసీ తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఓడీఐ వరల్డ్ కప్ వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 5 న ప్రారంభం కానున్న టోర్నమెంట్.. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.
ఈసారి ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. ఈసారి భారత్ మాత్రమే ఈ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఇదివరకు కూడా ఐసీసీ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చినా.. వేరే దేశాలతో పాటు ఆతిథ్యం ఇచ్చింది. భారత్ 1987 లో, 1996 లో, 2011 లో వన్డే ప్రపంచకప్ కు సంయుక్తంగా హోస్ట్ చేసింది. ఇక.. ఈ సారి వెస్టిండిస్ టీమ్ లేదు. ఈ సారి టోర్నీకి వెస్టిండిస్ జట్టు అర్హత సాధించలేదు. ఈసారి బౌండరీ కౌంట్ నియమాన్ని తీసేశారు. ఎందుకంటే 2019 ప్రపంచ కప్ లో బౌండరీ కౌంట్ నియమం ఉపయోగపడింది. కానీ.. ఈ నిబంధనపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఈసారి ఆ నిబంధనను తీసేసి కేవలం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు. అది కూడా టై అయితే మరో సూపర్ ఓవర్ ఆడతారు.
#image_title
ఇక.. ఐసీసీ ఇప్పుడు సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను కూడా రద్దు చేసింది. దాని ప్రకారం థర్డ్ అంపైర్ బ్యాటింగ్ చేసే వ్యక్తి ఔట్ పై నిర్ణయం తీసుకుంటారు. అది ఎప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోలేకపోతే. కానీ.. థర్డ్ అంపైర్ కూడా నిర్ణయం తీసుకోలేకపోతే.. అప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే ప్రకటించాలి. అదే చాలా వివాదాలకు దారి తీయడంతో ఈసారి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేశారు. అంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.