
Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆసక్తి చూపాడా... లేదంటే ఓవరాక్షన్ చేస్తున్నాడా..!
Virat Kohli : టీమిండియా Team India సీనియర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీని Virat Kohli ఒకప్పుడు పరుగుల రారాజుగా పిలిచేవారు. ఆయన ఇప్పుడు పేలవ ఫామ్లో ఉన్నాడు. అతడి బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మునుపటి ఉత్సాహం, విశ్వాసం లోపిస్తున్నాయి. అందుకే తన బలమైన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ షాట్ ఆడి వరుసగా 8 సార్లు ఔట్ అవ్వడం మనం చూశాం.. అయితే వైఫల్యాల నుంచి బయటపడాలని భావిస్తున్న విరాట్.. అందుకు దేశవాళీల బాట పట్టాలని భావించాడు. రంజీ ట్రోఫీ మ్యాచులతో తిరిగి ఫామ్ను అందుకోవాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ జట్టుతో కలసి ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అయితే హఠాత్తుగా రంజీలకు అతడు దూరమనే వార్త బయటకు వచ్చింది.
Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆసక్తి చూపాడా… లేదంటే ఓవరాక్షన్ చేస్తున్నాడా..!
Virat Kohli కారణం ఏంటి?
విరాట్ కోహ్లీకి ఆరోగ్యం బాగాలేదని.. మెడ నరం పట్టేసిందని.. అందువల్లే అతడు రంజి క్రికెట్ ఆడడం లేదని తెలుస్తోంది.. మెడనొప్పిని తగ్గించుకోవడానికి అతడు ఇంజక్షన్లు వాడుతున్నాడని.. అందువల్లే అతడు ఫైనల్ లో ప్లే -11 లో ఆడటం కష్టమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.. విరాట్ కోహ్లీ గాయానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతో పాటు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ Rishabh Pant, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు జనవరి 23 నుంచి ప్రారంభం కానున్న రంజీట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే.. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లు మాత్రం రంజీ మ్యాచ్ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడే కోహ్లీ మెడ పట్టేసిందని, దానికి అతడు ఇంజెక్షన్లు కూడా వాడుతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లాండ్తో వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ Champions Trophy నేపథ్యంలో తాను కోలుకునేందుకు సమయం కావాలని, ఈ క్రమంలోనే రంజీ మ్యాచ్ ఆడలేనని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఆడే విషయంలో ఉత్కంఠ తొలగిపోకపోవడంతో అతడి స్థానంలో జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే తనకు కెప్టెన్సీ వద్దని రిషబ్ మొహమాటం లేకుండా చెప్పినట్టు సమాచారం.. అయితే కెప్టెన్సీ బాధ్యతలను ఆయుష్ బదోనికి అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ చివరి క్షణంలో రంజీల నుంచి వైదొలగడానికి గాయమే కారణమా? లేదా అతడ్ని ఎవరైనా ఆపేశారా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
This website uses cookies.