Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త… వ్యవసాయంలో రైతులకు వెన్నుద‌న్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. లేటెస్ట్‌ డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి ఏఐ (Artificial intelligence) జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే ఇత‌ర వ్యవసాయ పనులను సైతం సునాయాసంగా చేస్తుంది. పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే ఇంజినీరింగ్ యువకుడు ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Electric Tractor : రైతులకు శుభవార్త... ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త… వ్యవసాయంలో రైతులకు వెన్నుద‌న్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. లేటెస్ట్‌ డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి ఏఐ (Artificial intelligence) జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే ఇత‌ర వ్యవసాయ పనులను సైతం సునాయాసంగా చేస్తుంది.

పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే ఇంజినీరింగ్ యువకుడు ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. 2023లో తన పరిశోధనను పూర్తి చేసి వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో ఏఐ బేస్డ్ డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్‌లో తయారు చేయడం ప్రారంభించాడు. ఈ ట్రాక్టర్లను సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుంది.

Electric Tractor రైతులకు శుభవార్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి

Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

ఇందులో 15 హెచ్‌పీ, 50 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్లు సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ట్రాక్టర్ తయారీలో వాడిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం గ‌మ‌నార్హం. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను సోలార్‌ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మరొక అదనపు బ్యాటరీ ఇందులో ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరం వ‌చ్చిన‌ప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 గంటల వరకు నిర్విరామంగా ప‌ని చేస్తుంది. ఈ ట్రాక్టర్లకు సిద్ధార్థ్‌ పేటెంట్ సైతం పొందాడు. అతి త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది