
JIo Airtel : జియో బాటలోనే ఎయిర్టెల్.. ఒక్కసారిగా టారిఫ్లు అలా పెంచేసారేంటి..!
JIo Airtel : టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. అసలే వినియోగదారులు రీచార్జ్లతో సతమతం అవుతుండగా, ఇప్పుడు వారు ధరల పెంపు నిర్ణయం అందరు ఉలిక్కి పడేలా చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ టెలికాం సంస్థలు ఒక్కొక్కటిగా ధరలు పెంచేస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. గురువారం రోజున రిలయన్స్ జియో తమ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, మరుసటి రోజు అయిన శుక్రవారం దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ సైతం రీఛార్జ్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కనీసం 11 శాతం నుంచి గరిష్ఠంగా 21 శాతం వరకు ప్లాన్ల ధరలు పెరగనున్నాయని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయంతో కస్టమర్లకు అదనపు భారం పడనుంది. ఎయిర్టెల్ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో మెరుగైన నెట్వర్క్ మరియు స్పెక్ట్రమ్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు జియో కొత్త ధరలు కూడా జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ పై రోజుకు 70 పైసల కన్నా తక్కువే ధరల పెంపు ఉంటోందని తెలిపింది. దీంతో సామాన్యులపై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపింది. ఇంతకు ముందు ఎయిర్టెల్ కంపెనీ నవంబర్, 2021లో 20-25 శాతం మేర రీఛార్జ్ ధరలు పెంచింది. ఆ తర్వాత ఎలాంటి గణనీయమైన మార్పులు చేయలేదు. కొద్ది రోజుల క్రితమే స్పెక్ట్రం వేలం ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత రీఛార్జ్ ధరలు పెంపు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.
JIo Airtel : జియో బాటలోనే ఎయిర్టెల్.. ఒక్కసారిగా టారిఫ్లు అలా పెంచేసారేంటి..!
అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్లో ప్రస్తుతం రూ.179తో 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 28 రోజుల పాటు ఇస్తోంది. ఈ ప్లాన్ ధరను రూ.199కి పెంచింది. జులై 3 నుంచి రూ.199 చెల్లించాల్సి వస్తుంది. రూ. 265 ప్లాన్ ధర ఇకపై రూ. 299కు లభించనుంది. ఇందులో రోజుకు ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అలాగే 84 రోజుల వాలిడిటీ గల రూ.455 అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధరను రూ.509కి చేర్చింది. ఇక 365 రోజుల ప్లాన్ ధరను రూ.1799 నుంచి రూ. 1999కి పెంచింది. 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెలు లభిస్తాయి. రూ.299గా ఉన్న ప్లాన్ ధరను రూ. 349కి పెంచింది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్లో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. ఇవే కాదు.. సంస్థ అందించే అన్ని రకాల రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. డేటా యాడ్ ఆన్ ప్యాక్లు, పోస్టు పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచిన ఎయిర్టెల్ భారతి హెక్సాకామ్ లిమిటెడ్తోపాటు అన్ని సర్కిళ్లకు పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపింది.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.