JIo Airtel : జియో బాట‌లోనే ఎయిర్‌టెల్‌.. ఒక్క‌సారిగా టారిఫ్‌లు అలా పెంచేసారేంటి..!

JIo Airtel : టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. అస‌లే వినియోగ‌దారులు రీచార్జ్‌ల‌తో స‌త‌మ‌తం అవుతుండ‌గా, ఇప్పుడు వారు ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యం అంద‌రు ఉలిక్కి ప‌డేలా చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ టెలికాం సంస్థలు ఒక్కొక్కటిగా ధ‌ర‌లు పెంచేస్తూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. గురువారం రోజున రిలయన్స్ జియో తమ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, మరుసటి రోజు అయిన శుక్రవారం దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సైతం రీఛార్జ్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కనీసం 11 శాతం నుంచి గరిష్ఠంగా 21 శాతం వరకు ప్లాన్ల ధరలు పెరగనున్నాయని స్పష్టం చేసింది.

JIo Airtel కొత్త రేట్లు ఇలా..

ఈ నిర్ణయంతో వినియోగదారులు అవాక్క‌య్యారు. ఈ నిర్ణ‌యంతో కస్టమర్లకు అదనపు భారం పడనుంది. ఎయిర్‌టెల్‌ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో మెరుగైన నెట్‌వర్క్‌ మరియు స్పెక్ట్రమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు జియో కొత్త ధరలు కూడా జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ‌పై రోజుకు 70 పైసల కన్నా తక్కువే ధరల పెంపు ఉంటోందని తెలిపింది. దీంతో సామాన్యులపై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపింది. ఇంతకు ముందు ఎయిర్‌టెల్ కంపెనీ నవంబర్, 2021లో 20-25 శాతం మేర రీఛార్జ్ ధరలు పెంచింది. ఆ తర్వాత ఎలాంటి గణనీయమైన మార్పులు చేయలేదు. కొద్ది రోజుల క్రితమే స్పెక్ట్రం వేలం ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత రీఛార్జ్ ధరలు పెంపు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.

JIo Airtel : జియో బాట‌లోనే ఎయిర్‌టెల్‌.. ఒక్క‌సారిగా టారిఫ్‌లు అలా పెంచేసారేంటి..!

అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్‌లో ప్రస్తుతం రూ.179తో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు ఇస్తోంది. ఈ ప్లాన్ ధరను రూ.199కి పెంచింది. జులై 3 నుంచి రూ.199 చెల్లించాల్సి వస్తుంది. రూ. 265 ప్లాన్ ధర ఇకపై రూ. 299కు లభించనుంది. ఇందులో రోజుకు ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అలాగే 84 రోజుల వాలిడిటీ గల రూ.455 అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధరను రూ.509కి చేర్చింది. ఇక 365 రోజుల ప్లాన్ ధరను రూ.1799 నుంచి రూ. 1999కి పెంచింది. 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెలు లభిస్తాయి. రూ.299గా ఉన్న ప్లాన్ ధరను రూ. 349కి పెంచింది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇవే కాదు.. సంస్థ అందించే అన్ని రకాల రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. డేటా యాడ్ ఆన్ ప్యాక్‌లు, పోస్టు పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచిన ఎయిర్‌టెల్ భారతి హెక్సాకామ్ లిమిటెడ్‌తోపాటు అన్ని సర్కిళ్లకు పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపింది.

Recent Posts

TTD Recruitment 2025 : టీటీడీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు.. జీతం నెల‌కు రూ.61 వేలు

TTD Recruitment 2025 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రిక్రూట్‌మెంట్ 2025లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…

21 minutes ago

Ashada Masam : ఈ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలంటే… ఆషాడ మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు… కారణం తెలుసా…?

Ashada Masam : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక…

1 hour ago

Health Tips : మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను… పరగడుపున నమిలారంటే… ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు…?

Health Tips : ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఔషధ ఘనీ అని…

2 hours ago

Kannappa Movie Review : క‌న్న‌ప్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kannappa Movie Review : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…

9 hours ago

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

11 hours ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

12 hours ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

12 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

13 hours ago