Home » News » Samsung Galaxy S22 Has New Camera Upgrade
News

Samsung : సామ్ సంగ్ గెలాక్సీ S22 సిరీస్ లో కొత్త కెమెరా అప్ గ్రేడ్…

Authored By
aruna
The Telugu News | Published on: August 30, 2022, 6:00 pm
Advertisement

Samsung : స్యాంసంగ్ కంపెనీ తమ Galaxy S22 సిరీస్ కి సంబంధించి ఆసక్తి అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఈ సిరీస్ మోడల్ కు కొత్త కెమెరా అప్డేట్ అందిస్తున్నట్లు ఇటీవల తెలిపింది. Samsung Galaxy S22, Galaxy S22+ మరియు Galaxy S22 Ultra కోసం ఆగస్టు కెమెరా అందిస్తున్నట్లు అధికారిక కమ్యూనిటీ బ్లాగ్ పోస్ట్ లో విడుదల చేసింది. ఆగస్టు కెమెరా అప్డేట్ లో ఫోటో నైట్ మరియు వీడియో మోడ్ ల కోసం ఆప్టిమైజ్ చేయబడిన A1 ఇంజన్ అందిస్తున్నారు. ఫోటో మోడ్ లో HDR ఇమేజ్ క్వాలిటీని మెరుగుపరిచారు. Galaxy S22 సిరీస్ ఆగస్టు కెమెరా అప్డేట్ లో టెలి ఫోటో బ్యాక్ కెమెరా యొక్క హైపర్ లాప్స్ ఫంక్షన్కు అనుకూలత ఉంటుందని సాంసంగ్ పేర్కొంది.

Advertisement

కొత్త అప్డేట్ గైడ్ పరిమాణాన్ని కూడా విస్తరిస్తుంది మరియు క్విక్ ప్యానెల్ నుండి QR కోడ్ స్కానింగ్ వేగవంతం చేస్తుంది. కొత్త అప్డేట్ నైట్ మోడ్ లోని చిత్రాల రంగు మరియు చీకటిని కూడా మెరుగుపరిచిందని సాంసంగ్ తెలిపింది. ప్రో మరియు పోర్ట్రేయిట్ మోడ్ లలోని టెలిఫోటో కెమెరా ఇప్పుడు Galaxy S22 సిరీస్ కి కెమెరా అప్గ్రేడ్ చేయడం వలన షార్ట్ నెస్ మరియు కాంట్రాక్ట్ ఇంటెన్సిటీ మార్పులను కలిగి ఉంది అల్ట్రా తక్కువ లైట్ మోడ్ ఏ వన్ లెర్నింగ్ తో సంస్థ ద్వారా మెరుగుపరచబడుతుంది. తర్వాత అప్డేట్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. Samsung Galaxy S22 Ultra యొక్క సక్సెసర్ గా పేర్కొంటున్నా రాబోయే Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 200 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తుంది. సాంసంగ్ కంపెనీ వచ్చేయడాదిలో గెలాక్సీ S23 సిరీస్ ను పరిచయం చేసే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

Samsung galaxy S22 Has New Camera Upgrade

Advertisement

Galaxy S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ Qualcomm యొక్క 3D Sonic Max ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించగలరని ఒక టిప్ స్టర్ పేర్కొన్నారు. మరోవైపు కంపెనీ మాత్రం రాబోయే ఫ్లాగ్ షిప్ Galaxy S22 Ultra హ్యాండ్ సెట్ కు గురించి అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. కొరియాకు చెందిన ఐటీ న్యూస్ యొక్క నివేదిక ప్రకారం సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఒక దానిలో 200 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్ చేయడానికి కంపెనీ యోచిస్తుంది. Galaxy S23 Ultra సిరీస్లో సెన్సార్ తో అమర్చబడిన ఏకైక హ్యాండ్సెట్ కావచ్చు.

సాంసంగ్ దాని కొత్త సిరీస్ అభివృద్ధి మరియు ఉత్పత్తి ప్రణాళికలను జరుగుతున్నట్లు చెప్పబడింది. నివేదిక ప్రకారం దాని 200 మెగా ఫిక్సెల్ సెన్సార్ కోసం భాగాలను అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలను నియమించినట్లు పేర్కొంది. ప్రస్తుతం శాంసంగ్ ఎలెక్ట్రో మెకానిక్ మరియు సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే 200 మెగా పిక్సెల్ కెమెరాలను ఉత్పత్తి చేస్తున్నాయని నివేదిక పేర్కొంది సామ్సంగ్ చివరిగా కెమెరా అప్ గ్రేడ్ ను Galaxy S20 Ultra లో 108 మెగా పిక్సెల్ సెన్సార్ ను పరిచయం చేసింది. ఆ తర్వాత గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా మరియు గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా కూడా 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కొనసాగింపు చేసాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి