Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే కదా కావల్సింది..!
Electric Vehicles : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరిగింది. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణగా ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు . అయితే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
అయితే పెట్రోల్ బంకులతో పోల్చితే ఈవీ స్టేషన్స్ తక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈవీ స్టేషన్స్ ఏర్పాటు పెరుగుతోంది. పెట్రోల్తో బైక్లు వినియోగించడం కాస్త తగ్గడంతో ఈవీ స్టేషన్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీ వెహికిల్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే బ్యాటరీ చార్జ్ కావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది.
Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే కదా కావల్సింది..!
కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా కూడా సామ్ సంగ్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. సామ్సంగ్లోని బ్యాటరీ విభాగమైన సామ్సంగ్ ఎస్డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఈ బ్యాటరీకి సర్వీస్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబుతుంది. ఒక్కసారి ఇవి మార్కెట్ లోకి వస్తే ఇక ఈవీ వాహనాలకి గిరాకి మరింత పెరుగుతుందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.