Electric Vehicles : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరిగింది. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణగా ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు . అయితే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
అయితే పెట్రోల్ బంకులతో పోల్చితే ఈవీ స్టేషన్స్ తక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈవీ స్టేషన్స్ ఏర్పాటు పెరుగుతోంది. పెట్రోల్తో బైక్లు వినియోగించడం కాస్త తగ్గడంతో ఈవీ స్టేషన్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీ వెహికిల్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే బ్యాటరీ చార్జ్ కావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది.
కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా కూడా సామ్ సంగ్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. సామ్సంగ్లోని బ్యాటరీ విభాగమైన సామ్సంగ్ ఎస్డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఈ బ్యాటరీకి సర్వీస్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబుతుంది. ఒక్కసారి ఇవి మార్కెట్ లోకి వస్తే ఇక ఈవీ వాహనాలకి గిరాకి మరింత పెరుగుతుందని అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.