Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే కదా కావల్సింది..!
Electric Vehicles : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరిగింది. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణగా ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు . అయితే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
అయితే పెట్రోల్ బంకులతో పోల్చితే ఈవీ స్టేషన్స్ తక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈవీ స్టేషన్స్ ఏర్పాటు పెరుగుతోంది. పెట్రోల్తో బైక్లు వినియోగించడం కాస్త తగ్గడంతో ఈవీ స్టేషన్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీ వెహికిల్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే బ్యాటరీ చార్జ్ కావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది.
Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే కదా కావల్సింది..!
కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా కూడా సామ్ సంగ్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. సామ్సంగ్లోని బ్యాటరీ విభాగమైన సామ్సంగ్ ఎస్డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఈ బ్యాటరీకి సర్వీస్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబుతుంది. ఒక్కసారి ఇవి మార్కెట్ లోకి వస్తే ఇక ఈవీ వాహనాలకి గిరాకి మరింత పెరుగుతుందని అంటున్నారు.
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
This website uses cookies.