
Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే కదా కావల్సింది..!
Electric Vehicles : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరిగింది. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణగా ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు . అయితే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
అయితే పెట్రోల్ బంకులతో పోల్చితే ఈవీ స్టేషన్స్ తక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈవీ స్టేషన్స్ ఏర్పాటు పెరుగుతోంది. పెట్రోల్తో బైక్లు వినియోగించడం కాస్త తగ్గడంతో ఈవీ స్టేషన్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీ వెహికిల్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే బ్యాటరీ చార్జ్ కావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది.
Electric Vehicles : 9 నిమిషాల ఛార్జ్ చేస్తే ఏకంగా 900కి పైగా కి.మీ.. ఇదే కదా కావల్సింది..!
కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా కూడా సామ్ సంగ్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. సామ్సంగ్లోని బ్యాటరీ విభాగమైన సామ్సంగ్ ఎస్డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఈ బ్యాటరీకి సర్వీస్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబుతుంది. ఒక్కసారి ఇవి మార్కెట్ లోకి వస్తే ఇక ఈవీ వాహనాలకి గిరాకి మరింత పెరుగుతుందని అంటున్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.