
SBI కస్టమర్లకు ఊహించని షాక్ , ఇక ఆ లావాదేవీలఫై చార్జీల మోత..!
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్ ఇస్తూ ఆన్లైన్ ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీల ఛార్జీలలో కీలక మార్పులు చేసింది. సంక్రాంతి పండగ వేళ ఎస్బీఐ ప్రకటించిన ఈ నిర్ణయం డిజిటల్ లావాదేవీలు జరిపే వారిపై ప్రభావం చూపనుంది. ఇప్పటివరకు రూ. 5 లక్షల వరకు ఆన్లైన్ ఐఎంపీఎస్ (IMPS) బదిలీలు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు ఆ పరిమితిని భారీగా తగ్గించి రూ. 25,000 కు పరిమితం చేసింది. అంటే ఫిబ్రవరి 15, 2026 నుండి మీరు ఆన్లైన్ ద్వారా రూ. 25,000 దాటి ఒక్క రూపాయి బదిలీ చేసినా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తక్షణ నగదు బదిలీ కోసం ఐఎంపీఎస్ను ఎక్కువగా వాడే వ్యాపారస్తులు మరియు సామాన్యులకు ఇది అదనపు భారంగా మారనుంది.
SBI కస్టమర్లకు ఊహించని షాక్ , ఇక ఆ లావాదేవీలఫై చార్జీల మోత..!
కొత్త నిబంధనల ప్రకారం, ఆన్లైన్ లావాదేవీల విలువను బట్టి ఛార్జీలు మారుతాయి. రూ. 25,001 నుండి రూ. 1 లక్ష వరకు బదిలీ చేస్తే రూ. 2 + జీఎస్టీ, రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల మధ్య అయితే రూ. 6 + జీఎస్టీ, మరియు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు భారీ లావాదేవీలకు రూ. 10 + జీఎస్టీ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి చేసే ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ల ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆఫ్లైన్లో రూ. 2 లక్షల పైన లావాదేవీలకు గరిష్టంగా రూ. 20 వరకు ఛార్జీలు యథావిధిగా కొనసాగుతాయి.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో గతంలో ఈ ఛార్జీలను ఎత్తివేసిన బ్యాంక్, ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించడం గమనార్హం. ఐఎంపీఎస్ సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో (YONO) యాప్ మరియు ఏటీఎంల ద్వారా 24/7 అందుబాటులో ఉంటాయి. అయితే, యూపీఐ (UPI) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతున్నందున, చిన్న మొత్తాల బదిలీకి ఇబ్బంది ఉండదు. కానీ, పెద్ద మొత్తంలో నగదును తక్షణమే పంపాల్సిన అవసరం ఉన్నప్పుడు వినియోగదారులు నెఫ్ట్ (NEFT) లేదా ఆర్టీజీఎస్ (RTGS) వంటి ఇతర ఆప్షన్లను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.SBI IMPS Charges , SBI IMPS Charges 2026, SBI Online Transfer Charges, SBI Bank Latest News, SBI Customers Shock, IMPS Transaction Charges SBI, SBI IMPS ఛార్జీలు , SBI కస్టమర్లకు షాక్, SBI కొత్త నిబంధనలు 2026, SBI బ్యాంక్ తాజా వార్తలు, SBI IMPS charges Telugu, IMPS లావాదేవీలపై ఛార్జీలు, SBI డిజిటల్ లావాదేవీలు, SBI ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు, SBI బ్యాంక్ అలర్ట్ న్యూస్,
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
This website uses cookies.