WhatsApp : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగితేలుతుంటారు. అందుకే వాట్సాప్ సంస్థ యూజర్ల అందుబాటులోకి మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. ఇక వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ను యూజర్ల అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఫీచర్ తో డెస్క్ టాప్లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దీనివలన యూజర్ చాట్ సంభాషణలకు అదనపు సెక్యూరిటీ ఉంటుందని వాట్సాప్ సంస్థ భావిస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనివలన వాట్సాప్ యూజర్ చాట్ సంభాషణలకు మరింత సెక్యూరిటీ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. ఇప్పటివరకు వాట్సాప్ డెస్క్ టాప్ వర్షన్ యాప్ కు ఎలాంటి పాస్వర్డ్ భద్రత లేదనే విషయం అందరికీ తెలిసిందే.
డెస్క్ టాప్ పై ఒక్కసారి లాగిన్ అయితే తర్వాత లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దీనివలన ఇతర వ్యక్తులు డెస్క్ టాప్లను వినియోగించే సమయంలో వాట్సాప్ యాప్ ను యాక్సెస్ చేయవచ్చు. దీంతో వ్యక్తిగత సమాచారం భద్రతకు ఆటంకం కలుగుతుంది. ఇలా యూజర్ల వాట్సాప్ చాట్ భద్రత ఉండాలని ఉద్దేశంతో స్క్రీన్ లాక్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ డెస్క్ టాప్ పై వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఒకవేళ యూజర్ తన పాస్వర్డ్ ని మర్చిపోతే యాప్ నుంచి లాగౌట్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ సహాయంతో లాగిన్ కావచ్చు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.