Telangana Budget 2024 : వ్యవసాయానికే పెద్దపీట వేశామన్న భట్టి .. దేశ చరిత్రలో ఇది మైలు రాయి అని కామెంట్..!
Telangana Budget 2024 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, మొత్తం బడ్జెట్ రూ.2,91,159 లక్షల కోట్లు కాగా.. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. మొత్తం రూ.72,659 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. సంక్షేమానికి కూడా రూ. 40 వేల కోట్లు కేటాయించారు.నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో భట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు.
రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్ అని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.72.659 కోట్లు.. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు. అలాగే ఉద్యానవనం రూ.737 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,980 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేకూర్చేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు.
Telangana Budget 2024 : వ్యవసాయానికే పెద్దపీట వేశామన్న భట్టి .. దేశ చరిత్రలో ఇది మైలు రాయి అని కామెంట్..!
సన్నరకం వరిసాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని.. అవి పండించిన రైతులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ‘రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తాం. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం చేస్తాం. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నాం.’ అని భట్టి పేర్కొన్నారు. పీఎం ఫసల్ భీమా యోజనాలో చేరాలని నిర్ణయించాం. రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో పంట లక్ష్యంగా పెట్టుకున్నాం అని భట్టి తెలిపారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.