
boduppal corporation brs corporators join in congress
Congress : బీఆర్ఎస్కు భారీ షాక్ మరోసారి తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 10 రోజులే సమయం ఉన్నా కూడా బీఆర్ఎస్ నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. కింది స్థాయి నేత దగ్గర్నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అందరూ కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటీవల మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ విజయం కోసం మేడ్చల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించగా.. ఈ రోడ్ షోకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరుపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ విజయ భేరి యాత్ర, మేడ్చల్ జనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశామన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు మేడ్చల్ లో బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. బోడుప్పల్ కార్పొరేషన్ కు చెందిన బీఆర్ఎస్ ఐదుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు బైబై చెప్పి.. కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, బోడుప్పల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్లకు రేవంత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, 11వ డివిజన్ కార్పొరేటర్ యాదగిరి, 20వ డివిజన్ కార్పొరేటర్ మహేందర్ యాదవ్, 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేశ్ యాదవ్ ఉన్నారు.
మేడ్చల్ లో జరిగిన అభివృద్ధి శూన్యం అని.. మల్లారెడ్డి మాత్రం ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పతనం మేడ్చల్ నుంచే ప్రారంభం అవుతుందని, కాంగ్రెస్ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, మేడ్చల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మల్లారెడ్డిని పండబెట్టుడు ఖాయం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
This website uses cookies.