Chiranjeevi : నేను బ్రతికున్నంత వరకు నా కొడుకుని రాజకీయాల్లోకి పంపను.. రామ్ చరణ్ పై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!
Chiranjeevi : హైదరాబాదులోని గోల్కొండ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జైశ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు భగవంతుడు కల్పించిన అదృష్టమని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో గోల్కొండలో హీరోయిన్లతో కలిసి డాన్స్ చేసిన సందర్భాలు, అలాగే పోరాట సన్నివేశాలు గుర్తొస్తున్నాయని అన్నారు. రాంచరణ్ తో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు.
1000 పదాలు చెప్పలేనిది ఓ దృశ్యం చెబుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలియజేసేలా అత్యాధునిక టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టం ఏర్పాటు చేయడం అభినందనీయమని చిరంజీవి అన్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాలని, గతంలో తాను కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీని టూరిజంలో నెంబర్ వన్ గా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మన దేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు, టూరిజం వసతులు ఎక్కడ ఉండవని తెలిపారు. ఓవైపు ఎడారి మరోవైపు మంచు ఇంకోవైపు అత్యధిక వర్షపాతం లాంటి విభిన్న పరిస్థితులు ఉన్నాయని, ఇది మన భారత్ గొప్పతనం అని కొనియాడారు. అయితే ప్రపంచ టూరిజంలో మనది కేవలం 1.3 శాతం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఖ్య మరింత పెరగాలని వరల్డ్ టూరిజం లో ఇండియా మెరుగైన స్థానంలో ఉండాలని తాను ఆశిస్తున్నాను అని అన్నారు. మన జీడిపిలో సింహభాగం టూరిజం నుంచే ఉందని చిరంజీవి వెల్లడించారు. ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో వారసత్వ సంపదకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక గోల్కొండ కోటలో సరికొత్త టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. అలాగే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. అక్కడ కూడా ఇలాంటి సౌండ్ అండ్ లైట్ షో కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, జోగులాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్నారు…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
This website uses cookies.