
Chiranjeevi : నేను బ్రతికున్నంత వరకు నా కొడుకుని రాజకీయాల్లోకి పంపను.. రామ్ చరణ్ పై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!
Chiranjeevi : హైదరాబాదులోని గోల్కొండ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జైశ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు భగవంతుడు కల్పించిన అదృష్టమని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో గోల్కొండలో హీరోయిన్లతో కలిసి డాన్స్ చేసిన సందర్భాలు, అలాగే పోరాట సన్నివేశాలు గుర్తొస్తున్నాయని అన్నారు. రాంచరణ్ తో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు.
1000 పదాలు చెప్పలేనిది ఓ దృశ్యం చెబుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలియజేసేలా అత్యాధునిక టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టం ఏర్పాటు చేయడం అభినందనీయమని చిరంజీవి అన్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాలని, గతంలో తాను కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీని టూరిజంలో నెంబర్ వన్ గా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మన దేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు, టూరిజం వసతులు ఎక్కడ ఉండవని తెలిపారు. ఓవైపు ఎడారి మరోవైపు మంచు ఇంకోవైపు అత్యధిక వర్షపాతం లాంటి విభిన్న పరిస్థితులు ఉన్నాయని, ఇది మన భారత్ గొప్పతనం అని కొనియాడారు. అయితే ప్రపంచ టూరిజంలో మనది కేవలం 1.3 శాతం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఖ్య మరింత పెరగాలని వరల్డ్ టూరిజం లో ఇండియా మెరుగైన స్థానంలో ఉండాలని తాను ఆశిస్తున్నాను అని అన్నారు. మన జీడిపిలో సింహభాగం టూరిజం నుంచే ఉందని చిరంజీవి వెల్లడించారు. ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో వారసత్వ సంపదకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక గోల్కొండ కోటలో సరికొత్త టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. అలాగే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. అక్కడ కూడా ఇలాంటి సౌండ్ అండ్ లైట్ షో కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, జోగులాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్నారు…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
This website uses cookies.