
Revanth Reddy : గుంపు మేస్త్రీ అన్న కేటీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అంటూ కేటీఆర్ మాట్లాడారు. డిసెంబర్ 3న గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అయ్యారని, రైతుబంధు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారని, కానీ విదేశాలకు వెళ్లి అబద్దాలు చెబుతున్నారని, దావోస్ ప్రపంచ వేదికపై అసత్యాలు చెప్పారని, రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుంపు మేస్త్రి పాలనలో ప్రజలు పథకాల కోసం క్యూ కడుతున్నారని, ఆర్టీసీ బస్సులలో మహిళలు సిగపట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని కేటీఆర్ తెలిపారు.
ఇక తనను గుంపు మేస్త్రి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవును..నేను మేస్త్రినే..మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్ నిర్మించిన మేస్త్రిని అని కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రిని నేనే అని హెచ్చరించారు. బిడ్డల్లారా కాసుకోండి..ఈ నెలాఖరులో ఇంద్రవల్లి వస్తున్నాను అంటూ పేర్కొన్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , రేవంత్ రెడ్డి , మంత్రులు , ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ కుటుంబం త్యాగాలతోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు.
కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తాను సీఎం పదవిలో ఉన్నానని ఆయన తెలిపారు. బిల్లా రంగాలు కేటీఆర్ హరీష్ చాలా మాట్లాడుతున్నారని, చార్లెస్ శోభరాజ్ కేసీఆర్ దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకొని ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులకు కేసీఆర్ అమ్ముకుంటే తాము మాత్రం ఉద్యమకారులకు పదవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని అప్పుడే హామీలు అమలు చేయాలని గోల చేస్తున్నారని మండిపడ్డారు. పథకాలను ఫిబ్రవరిలో అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు భరోసా నిధులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్కంఠకు గురిచేస్తున్న స్టార్…
Today Gold Rate : బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది పెట్టుబడి, భద్రత,…
Collagen Drinks : వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో సహజంగా ఉండే కొల్లాజెన్ ( Collagen ) ఉత్పత్తి తగ్గడం…
High-Protein Vegetarian Diet : ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కండరాల నిర్మాణం, కణజాలాల…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ఈ…
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
This website uses cookies.