
YS sharmila : నా కుటుంబం చీలడానికి కారణం ఎవరు..? జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్...!
YS sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తాజాగా తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగన్ గురించి అనేక రకాల విషయాలను తెలియజేసింది.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ….జగనన్న ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారనే ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట..కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చీల్చింది.. నా కుటుంబాన్ని కూడా చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయస్థితిలో ఉంది అంటే దానికి గల కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు మరియు ఇక ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఇక ఈరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ రెండు గా చీలింది అంటే అది చేతులారా చేసుకుంది జగనన్న గారు. ఇక దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగనన్న పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్లను మంత్రులను చేస్తానని మాట ఇచ్చాడు జగనన్న. మరి ఈరోజు వారిలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు మీరే చెప్పండి. వాళ్లు రాజీనామాలు చేస్తే వారి కోసం నేను అమ్మ తిరిగాం. వారి గెలుపుకు బాట పట్టినం. వారిని గెలిపించాం. ఆ తర్వాత వైసిపి పార్టీ ఇబ్బందుల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమంటే , మా ఇంటి నీ పిల్లలని అందరినీ పక్కనపెట్టి ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి పాదయాత్ర చేశాను. రోడ్లమీదనేే పడుకున్నాను. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసాను. ఆ తర్వాత సమైకాంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం అది కూడా చేశాను.
ఇలా ఏది చేయమంటే అది ఎలాంటి స్వలాభం చూడకుండా చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు. మాకు అన్యాయం జరిగినప్పటికీ తాను ముఖ్యమంత్రి అయి రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబడితే చాలు , ఆయన ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్న. కానీ గెలిచిన తర్వాత వారంతా బిజెపికి బానిసలుగా మారారని షర్మిల చెప్పుకొచ్చింది. ఈ విధంగా సభలో జగన్ పై షర్మిల విరుచుకుపడింది.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.