Revanth Reddy : ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన CM రేవంత్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన CM రేవంత్..!

 Authored By siddhu | The Telugu News | Updated on :27 March 2026,6:40 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన CM రేవంత్..!

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సౌండ్ వినిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు కళ్ళు బైర్లు కమ్మేలా ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎంఆర్ఎఫ్ నిధుల విషయంలో జరిగిన అక్రమాలపై ఆయన సీరియస్ అయ్యారు. అర్హులైన పేదలకు అందాల్సిన పైసలను కొందరు బీఆర్ఎస్ నాయకులు హాస్పిటల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై పక్కదారి పట్టించారని రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెప్పారు.

Revanth Reddy ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన CM రేవంత్

Revanth Reddy : ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన CM రేవంత్..!

అసలు ఈ గొడవ అంతా ఆరోగ్య శ్రీ బకాయిల దగ్గర మొదలైంది. హాస్పిటల్స్ కు రావాల్సిన వందల కోట్ల బకాయిల మీద బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయాలని చూశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అంతకంటే ముందే పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెడితే తాము వచ్చిన కొద్ది కాలంలోనే వాటిని వందల కోట్లకు తగ్గించామని గుర్తు చేశారు. అసలు బకాయిలు ఎందుకు పెరిగాయో ఆరా తీస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయని సీఎం చెప్పారు. లేని జబ్బులకు ఉన్నట్టుగా కలరింగ్ ఇచ్చి తప్పుడు క్లెయిమ్స్ ద్వారా ప్రజా ధనాన్ని గులాబీ నేతలు జేబుల్లో వేసుకున్నారని ఆయన మండిపడ్డారు.తినేసి కూర్చుంటే సరిపోదు.. తిన్నది అంతా కక్కిస్తా అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. సీఎంఆర్ఎఫ్ నిధుల మాయంపై ఇప్పటికే విచారణ వేగవంతం చేశామని త్వరలోనే నిందితుల చిట్టా బయటకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పేదల ప్రాణాలను కాపాడాల్సిన నిధులతో వ్యాపారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ దెబ్బతో అక్రమాలకు పాల్పడిన నాయకుల్లో వణుకు మొదలైంది. సీఎం మాటలు చూస్తుంటే ఈసారి వ్యవహారం కేవలం విచారణకే పరిమితం కాకుండా రికవరీ వరకు వెళ్లేలా కనిపిస్తోంది.ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటానికి ఇలాంటి స్కాములే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గట్టిగా నిలదీసి దొంగలను పట్టుకుంటే ఆ డబ్బుతోనే నిజమైన పేదలకు వైద్యం అందించవచ్చని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సీఎంఆర్ఎఫ్ స్కామ్ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ప్రతిపక్షాలకు ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ తో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది