
Mallapur : నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్... శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్..!
Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar మల్లాపూర్ బాబానగర్ కు చెందిన గుడిసె కవిత గురువారం మల్లాపూర్ సూర్య నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కొరకు సాయంత్రం ఐదున్నర గంటలకు వెళ్ళింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లు నిర్లక్ష్యంగా స్టాఫ్ నర్స్ తో డెలివరీ చేయించడంతో పాప మృతి చెందింది, సదరు డాక్టర్, స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ,సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట సీపీఐ, ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్,ఎన్ఎఫ్ఐడబ్య్లు ఉప్పల్ మండల సమితి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Mallapur : నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్… శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్..!
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్య ప్రసాద్ లు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు యమపాశాలుగా మారాయనడానికి ఈ ఘటన తార్కాణంగా మారిందని ధ్వజమెత్తారు. మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఇప్పటివరకు 75కు పైగా డెలివరీలు చేశానని బాహాటంగా చెబుతుందంటే, ఈ ఆసుపత్రిలో డాక్టర్ సేవలు నిరుపయోగమనే భావన వ్యక్తం అవుతుందన్నారు. చిన్నారి ఘటన విషయంలో స్టాఫ్ నర్సు అన్నీ తానై, డాక్టర్ కు సమాచారం ఇచ్చినా సమయానికి రాకపోవడంతో వల్లనే చిన్నారి మరణించిందని వారు ఆరోపించారు. ఈ ఆసుపత్రిలో గతంలొనే అనేక ఘటనలు జరిగాయని,
కుక్క కాటుకు రాబీస్ టీకా లేకపోవడం,సిబ్బంది, డాక్టర్లు సమయానికి రాకపోవడం వంటి ఘటనలు జరిగాయన్నారు. ప్రజల పట్ల, పేషెంట్ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ ఆసుపత్రికి సాధారణంగా మారిందని విమర్శించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి డాక్టర్ ….మల్లాపూర్ ఆసుపత్రిలోనే మరణించిన చిన్నారిని, గాంధీ ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. చిన్నారి మృతి ఘటనపై జిల్లా వైద్యశాఖ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ జరిపి, ఘటనకు కారకులైన డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం, ఈ ఘటనపై విచారణ జరపడానికి ఆసుపత్రికి వచ్చిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ వైద్యశాకాదికారి సత్యవతికి సంఘాల పక్షాన ఫిర్యాదు చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్,ఏఐఎస్ఎఫ్ నాయకులు అజీమ్ పాషా, మహిళా సమాఖ్య నాయకురాలు మేరీ, స్వర్ణ ,కావ్య,రాజు పాల్గొన్నారు.
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల…
Gold and Silver Price 14 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి, పసిడి ప్రియులకు…
Karthika Deepam 2 March 14th 2026 Today Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Healthy Drinks : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ఈ సమయంలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాల కోసం…
Black Coffee Benefits : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ముఖ్యంగా పాలు,…
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
This website uses cookies.