Etela Rajender : మరో 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఉండడంతో పొలిటికల్ హిట్ బాగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ఇక్కడ లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ నేతలు వారి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక ఈ పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి గారు , బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డి గారు , బీజేపీ నుండి ఈటెల రాజేంద్రప్రసాద్ గారు పోటీ చేస్తునారు.
ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి.ఇలాంటి తరుణంలో తాజాగా ఈటెల రాజేంద్రప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎవరికి అంత ఆదరణ లేదని తెలియజేశారు. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి అంతేకాక నాకు 22 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నన్నే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
అంతేకాక దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారు కాబట్టి మల్కాజ్ గిరిలో అభివృద్ధి జరగాలంటే రాజేంద్ర ప్రసాద్ ఉండాలని ప్రజలు భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మరియు బీఆర్ఎస్ అభ్యర్థులు నాకు పోటీ కాదని గత 22 ఏళ్లుగా నేను చేస్తున్న సర్వీసు నా పట్ల ప్రజలకు ఉన్న భావన లెక్కలోకి వస్తాయని తెలిపారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్నా సరే , వారి యొక్క హక్కులకు ఆటంకం కలిగిన , ఎక్కడ అన్యాయం జరిగిన ఆ అన్యాయానికి గొంతుకై మాట్లాడే వారి బిడ్డను నేను అంటూ ఈ సందర్భంగా ఈటల రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నేపథంలోనే రానున్న ఎన్నికల్లో 100% ప్రజల మద్దతు తనకి దొరుకుతుందని తెలిపారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.