
PMAY : పీఎంఏవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
PMAY : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన Pradhan Mantri Awas Yojana (అర్బన్) 2.0 కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy గారు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. పీఎంఏవై 2.0లో చేరిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేస్తూ, ఇందుకు సంబంధించిన సమగ్ర డేటా సిద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి ఆ మేరకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉన్నందున మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లను గుర్తించామని ముఖ్యమంత్రి గారు వివరించారు.
PMAY : పీఎంఏవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
ఆరింటిలో తొలి అయిదు కారిడార్లకు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ. 24,269 కోట్లు వ్యయమవుతుందన్నారు. డీపీఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం (జేవీ) కింద చేపట్టి నిధులు కేటాయించాలని కోరారు. గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారు హర్కార వేణుగోపాల్ గారు, మల్కాజిగిరి లోక్సభ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు అంశాలను కేంద్ర మంత్రి గారి దృష్టికి తెచ్చారు.
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కేంద్రం చేయూతనివ్వాలి. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కి.మీ. (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి అయ్యే రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి. హైదరాబాద్ నగరంతో పాటు సమీపంలోని 27 పట్టణ పాలక సంస్థల పరిధిలో మురుగు నీటి నెట్వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) కు నిధులివ్వాలి.
తెలంగాణ Telangana Govt రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను నోటిఫై చేసింది. Warangal వరంగల్ నగరంలో రూ. 41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు నిధులు కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలి. విద్యుత్ సరఫరా, నెట్వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో 9 ప్రాజెక్టు నివేదికలను సమర్పించాం. వెంటనే మంజూరు చేయాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ఇచ్చిన రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గించాలి. కొత్త పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. అందువల్ల ఆర్పీపీవో లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలి.
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
MSG Collections | బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్ ఓపెనింగ్స్తో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్నాడు…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
Sudigali Sudheer - Rashmi Gautam : బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ఎంతోమంది సామాన్యులను…
Bhartha Mahasayulaku Wignyapthi : వరుస పరాజయాలతో సతమతం అవుతున్న మాస్ మహరాజ్ రవితేజ, తన తాజా చిత్రం “భర్త…
This website uses cookies.