
MLA Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పటి నుంచి ఇస్తారో ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబంధు ప్రతి ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు అది కూడా డిసెంబర్ 9న రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామని అన్నారు. రైతుబంధు డబ్బుల కోసం ప్రజలు రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ఏదైనా ప్రకటన చేస్తారని అనుకున్నాం. కానీ అలాంటి ప్రకటన చేయలేదు అని హరీష్ రావు తెలిపారు. ఎకరానికి 7500 చొప్పున రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని కోరారు. రైతుబంధు ఎప్పుడు వేస్తారో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంటలు ప్రారంభం అయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారంలోపు రైతుబంధు వేసామని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మరో వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి క్వింటాల్ కి గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి వడ్లు త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. రైతులు రోడ్లపై దాన్యపు రాశులు ఆరబెడుతున్నారని, తుఫాను కారణంగా వర్షాలు పడుతుండడంతో దాన్యం తడిసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులంతా ప్రభుత్వం ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నికల ప్రచారంలో మీరు వడ్లు అమ్ముకోవద్దు. మేము అధికారంలోకి రాగానే ప్రతి క్వింటాలకి 500 బోనస్ ఇస్తామని, వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. మీరు ప్రకటించిన 500 బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారో, బోనస్ తో కూడిన వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అని రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ పెద్దలే వారికి స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే విమర్శలు చేయడం లేదని, ప్రజల పక్షాన రైతుల పక్షాన అడుగుతున్నామని అని హరీష్ రావు తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఆరోగ్యారెంటీలలో ఒకటైన గృహలక్ష్మి పథకాన్ని అమలు చేశారు ఇక ఇప్పుడు రైతుబంధు పథకం అమలు చేస్తారేమో చూడాలా అది ఎప్పుడు అమలు చేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.