Jana Reddy : నేను ప్రాణం పోసిన వాళ్లే నన్ను చంపాలనుకుంటున్నారు… జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు..?

Advertisement
Advertisement

Jana Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున జానారెడ్డి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా.. తాజాగా హాలియాలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈసందర్భంగా మాట్లాడిన జానారెడ్డి… తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

janareddy fires on cm kcr in haliya public meeting

Jana Reddy : తెలంగాణ రాష్ట్రం కోసం మా పదవులనే త్యాగం చేశాం

కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది… అని అంటున్నారు కదా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం మేము మా పదవులను త్యాగం చేశాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ. సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు వరంగా మారింది. ఇలా.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాగర్ అభివృద్ధి చెందిందే కాంగ్రెస్ పార్టీ వల్ల. గిరిజనుల కోసం అటవీ హక్కులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. భూపరిహార చట్టాలన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ.. అంటూ జానారెడ్డి ఈసందర్భంగా వెల్లడించారు.

Advertisement

Jana Reddy : వీళ్లకు ఎమ్మెల్యేలు కాదు.. సర్పంచ్ లు అయ్యే అర్హత కూడా లేదు

కాంగ్రెస్ పార్టీలో చేరి.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి… తర్వాత అమ్ముడుపోయి.. కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఎదిరిస్తున్నారు. వీళ్లు ఎమ్మెల్యేలు కాదు.. సర్పంచ్ లు కూడా అయ్యే అర్హత లేదు. ఓవైపు ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. నాయకులు ఫిరాయింపులకు పాల్పడి… కన్నతల్లి లాంటి పార్టీని తలదన్ని అమ్ముడుపోయారు. నేను ప్రాణం పోసిన వాళ్లే నన్ను చంపాలనుకుంటున్నారు. ఇటువంటి నాయకులా కావాల్సింది మనకు. వీళ్లకు సరైన బుద్ధి చెప్పాల్సింది మీరే. కాంగ్రెస్ పార్టీకి విఘాతం కలిగిస్తున్న ఇటువంటి నాయకులకు గుణపాఠం చెప్పడమే కాదు… ప్రజాస్వామ్యాన్న వమ్ము చేస్తూ.. పశువుల్లాగా అమ్ముడుపోతూ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని కూడా ఓడించాలి.. అని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే… ఎవ్వరూ ప్రచారం చేయకండి. టీఆర్ఎస్ వాళ్లు ప్రగత్ భవన్ లో ఉండండి… నేను గాంధీ భవన్ లోనే ఉంటా… బీజేపీ నేతలు వాళ్ల ఆఫీసులో ఉండండి. ఇప్పుడు ఎన్నికలు పెడదాం. ఈ సవాల్ కు అందరూ సిద్ధమా? అంటూ జానారెడ్డి సవాల్ విసిరారు.

నాగార్జునసాగర్ ను బాగు చేసిందే నేను. ఇప్పుడు మేం అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కన్నా నాగార్జునసాగర్ ను ఎప్పుడో నేను అభివృద్ధి చేశా. నా అభివృద్ధి గురించి అడగడానికి నీకు హక్కు లేదు. నేను ప్రశ్నిస్తే… ఇండ్లు కట్టడం ఆపేస్తారా? ఇలాంటి మీరు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు. నన్ను ప్రశ్నించే ఎమ్మెల్యేలు… వాళ్ల నియోజకవర్గాల్లో ఎన్ని ఇండ్లను కట్టారో చెబుతారా? అంటూ జానారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

13 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.