KCR : తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార తెరాస పార్టీ ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం రెండు మూడు నెలల ముందు నుండి గులాబీ అధినేత సాగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఫైనల్ కాలేదు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ నేత జానారెడ్డి పోటీకి సిద్దమయ్యాడు. దీనితో ఆయన్ని ఢీ కొట్టే నేత కోసం తెరాస అధినేత అనేక సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయనో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా బుధవారం అంటే ఈరోజే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాగర్ లో బీసీ నేతను పోటీకి దించితే మంచి ఫలితం ఉంటుందని తెరాస వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలోని సీనియర్ మంత్రులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన నోముల నర్సింహయ్య కూడా అదే సామజిక వర్గానికి చెందిన వ్యక్తి.
దీనితో అదే వర్గానికి చెందిన నేతను పోటీకి దించాలని చూస్తున్నారు. మన్నెం రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్యాదవ్, బాలరాజ్ యాదవ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. బీసీఅభ్యర్థి కాని పక్షంలో ప్రస్తుత ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పార్టీ నేత కోటిరెడ్డిల పేర్లు సైతంపరిశీలించే వీలుంది. అయితే బీసీ సామాజిక వర్గం నేతలకే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్ పేరు తెరమీదకు వచ్చింది.
దుబ్బాక ఎన్నికల్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి టిక్కెట్ ఇస్తే ఓడిపోవటం జరిగింది. అదే సెంటిమెంట్ సాగర్ లో కూడా రిపీట్ అవుతుంది ఏమో అని కేసీఆర్ భయపడ్డాడు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల తెరాస విజయం సాధించటంతో ధైర్యం గా నోముల ఫ్యామిలీకి సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికలో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను అక్కడే మకాం వేయించేందుకు గులాబీ బాస్ వ్యూహం వేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటుగా జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ను అక్కడే మోహరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.