
kcr
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంత త్వరగా అర్ధం కావు.. ఆయన ఏమైనా చేయాలని అనుకుంటే దానికి తగ్గట్లు గ్రౌండ్ సిద్ధం చేసుకొని దిగుతాడు.. ఎప్పటినుండో బీజేపీకి వ్యతిరేకంగా తన వాణి వినిపించాలని బలంగా ఎదురుచూస్తున్నాడు. ఒకటి రెండు సందర్బాలు దొరికిన కానీ, తెలంగాణలో పరిస్థితి కేసీఆర్ కు అనుకూలించలేదు. దీనితో ఇప్పుడు తన రూటు మార్చినట్లు తెలుస్తుంది.. ఈసారి తెలంగాణ గడ్డ మీద నుండి కాకూండా ఆంధ్రుల గడ్డ నుండి బీజేపీ వ్యతిరేక స్వరాన్ని వినిపించాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తుంది..
కేసీఆర్ ఏంటి ఆంధ్రా నుండి పోరాటం ఏంటని అందరు అనుకోవచ్చు కానీ, రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఉహించలేము.. ప్రస్తుతం ఆంధ్రాలో విశాఖ స్టీల్ ఉద్యమం నడుస్తుంది. దీనికి వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చిన కానీ, ఉద్యమంలోకి నేరుగా వచ్చే ప్రసక్తి లేదు. దీనికి ఎవరికివారికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీని తీసుకుంటే.. పార్టీ అధినేత సీఎం జగన్పై సీబీఐ కేసులు.. ఉన్నాయి. ఇక చంద్రబాబుపై ఓటుకు నోటు సహా వివిధ అవినీతి మరకలు అంటుకున్నాయి.
ఇక జనసేన అధినేత పవన్.. పెయిడ్ బ్యాచ్ అనే ముంద్ర సంపాయించుకున్నారు. దీంతో రాజకీయంగా బీజేపీని టార్గటె్ చేసేందుకు ఈ ముగ్గురూ కూడా ఉత్సాహం చూపించడం లేదు. ఒక్క మాట కూడా అనకపోగా.. అవకాశం చూసుకుని మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరూ కూడా ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న దాఖలా కనిపించడం లేదు.
ఇదే సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమం గురించి కేటీఆర్ మాట్లాడటం, ఉద్యమ నేతలు కేటీఆర్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. పైగా గంట శ్రీనివాసు లాంటి కీలక నేత కూడా కేటీఆర్ ను కలవటం అనేది చిన్న విషయం కాదు.. ఇవన్నీ కూడా కేసీఆర్ సున్నితంగా గమనిస్తున్నాట్లు తెలుస్తుంది. అయితే సరైన సమయం కోసం చూస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి..
kcr Public Meeting In Andhrapradesh
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, వాటి ఫలితాలను బట్టి కేసీఆర్ వ్యూహం ఉండబోతుందని సమాచారం.. మమతా బెనర్జీ మరోసారి గెలిచి వచ్చే ఎన్నికల నాటికీ ప్రత్యేక ఫ్రంట్ ఏర్పడితే.. అందులోకి కేసీఆర్ వెళ్ళిపోయి, ఇక్కడ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనీ చూస్తున్నాడు. ఇదే సమయంలో ఆ ప్రత్యేక ఫ్రంట్ లో తన విలువ ఏమిటో చూపించుకోవాలి కాబట్టి, విశాఖలో దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు..
అదే కనుక జరిగితే ఇక ఆంధ్రలోని కీలక నేతలైన ఆ ముగ్గురు ఇబ్బంది తప్పకపోవచ్చు, పక్క రాష్ట్రము వ్యక్తి వచ్చి విశాఖ ఉద్యమం కోసం పోరాటం చేస్తుంటే సొంత రాష్ట్రము నేతలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు ప్రజా ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం ఆ తర్వాత జరగబోయే ఎన్నికల మీద ఉంటుంది.. ఇక ఫైనల్ గా చెప్పాలంటే కేసీఆర్ మాత్రం విశాఖ ఉద్యమంలో పాల్గొంటే మాత్రం బీజేపీ పరిస్థితి ఏమిటో కానీ,, ఈ ముగ్గురు నేతలకు మాత్రం ఇబ్బందులు ఖాయం .
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Carmeni Selvam Movie : పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
This website uses cookies.