
KTR : రాజముద్రలో అమరవీరులు ఉండొద్దా కేటీఆర్..!
KTR : తెలంగాణలో ఇప్పుడు రాజముద్రపై రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మారుస్తామని తెలిపారు. ఇప్పుడున్న రాజముద్రలో రాజరిక వాసనలు కనిపిస్తున్నాయి తప్ప.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు కనిపించట్లేదని ఆయన వాపోయారు. అందుకే అధికారిక చిహ్నం మీద తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసేలా రాజముద్రను మారుస్తాం అని ఆయన తెలిపారు. అయితే దానిపై ఇప్పుడు కేటీఆర్ భగ్గుమంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. అధికారిక చిహ్నాని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ఆనవాళ్లను తొలగించాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంకుచితంగా ఆలోచిస్తోందని తెలిపారు. ఓరుగల్లు సాక్షిగా మరో ఉద్యమాన్ని రగిల్చి రేవంత్ రెడ్డి సర్కార్ మీద పోరాడుతాం.. రాష్ట్ర రాజముద్రలో తెలంగాణలో సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం రాచరిక పోకడ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం కరెక్టు కాదు. వెయ్యేళ్ల సాంస్క్రతి వైభవానికి అవి చిహ్నాలు. పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది అంటూ కేటీఆర్ మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.
KTR : రాజముద్రలో అమరవీరులు ఉండొద్దా కేటీఆర్..!
ఎందుకంటే అధికారిక చిహ్నంలో ఎంతసేపు రాజముద్రలు కనిపించాలని కేటీఆర్ భావిస్తున్నారే తప్ప.. అమరవీరులు కనిపించాలని ఆయన అనుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఎంత మంది కేసీఆర్ లు పోరాడినా సరే.. గుప్పెడు మంది అమరవీరులు లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చేదా.. కేంద్రం ఉద్యమాన్ని గుర్తించేదా అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల కనికరం చూపించాయి అంటే అది ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల ఫలితమే కదా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన సామాన్యులు రాజముద్రలో ఎందుకు భాగస్వామ్యం కాకూడదు అని ప్రశ్నిస్తున్నారు. వారి ఆశలు.. ఆకాంక్షల్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకునేలా రాజముద్రలో వారు ఉండొద్దా? చరిత్రను కొనసాగించాలనే కేటీఆర్.. వర్తమానాన్ని ఎందుకు భాగస్వామ్యం చేయొద్దని భావిస్తున్నారు అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
Vijay - Rashmika : టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో…
Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్పై విడుదలైన ప్రముఖ…
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…
This website uses cookies.