KTR : అంతా నిబంధనల ప్రకారమే జరిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్
KTR : హైదరాబాద్లో జరిగిన ఫార్ములా-ఇ రేస్లో Formula E race case సుమారు 55 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు సంబంధించి BRS బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావుపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) గురువారం కేసు నమోదు చేసింది. కెటిఆర్పై అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్లు మరియు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) మరియు 120 బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేయబడింది.కెటిఆర్ను ప్రధాన నిందితుడిగా (ఎ-1), సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ మరియు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఎ-2 నిందితులుగా పేర్కొన్నారు.
కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, రేస్ నిర్వాహకుల మధ్య ఒప్పందం జరిగిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలోనే ఇది జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈ పరిణామంపై స్పందించిన కేటీఆర్ .. ఈ కేసులో రూ.55 కోట్లను ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. కానీ నిబంధనల ప్రకారమే అంతా జరిగినట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి తనదే బాధ్యత అని, అధికారులు తన ఆదేశాలతోనే అంతా చేశారని వెల్లడించారు. దీనికి పూర్తి బాధ్యత మాత్రం తనదే అని పేర్కొన్నారు.
KTR : అంతా నిబంధనల ప్రకారమే జరిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్
ఈ కేసులో కేటీఆర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే శిక్ష తనకు మాత్రమే పడేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలా కాకుండా కేసును మరింత లోతుగా విచారిస్తే అది బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారగలదని, అందుకే కేటీఆర్ కేసును తనవరకే పరిమితం చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. కేటీఆర్ ఓవైపు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే మరోవైపు అరెస్టుకు సిద్ధపడుతూ కేసును తనవరకే పరిమితం అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. KTR, Formula-E case Race , Formula-E, cm revanth reddy
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.