Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి
ప్రధానాంశాలు:
Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు చేసిన భావోద్వేగపూరిత పిలుపు తీవ్ర చర్చకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తాము లేమని, కేదారనాథ్కి వెళ్లిపోతున్నామని, ఇక తమ జీవితాన్ని తామే బ్రతుకుతామని పేర్కొన్నారు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. “ఇంకా 2-3 రోజులు చూస్తాము, అప్పటికీ మా మీద ట్రోలింగ్ ఆపకపోతే మేమిద్దరం పెట్రోల్ పోసుకుని దహనం చేసుకుంటాము” అనే వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి
Lady Aghori : ప్రాణాలు తీసుకోబోతున్నాం అంటూ హెచ్చరించిన అఘోరీ, వర్షిణి
ఈలా వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకువచ్చే వేధింపులు ఎంత భయానక ఫలితాలను కలిగించగలవో ఇది సాక్ష్యం. వ్యక్తులపై చీటింగ్, ఆరోపణలు, విమర్శలు ఎలాంటివైనా ఆధారాలతో ఉండాలి. లేకపోతే ఈ విధంగా సామాజికంగా, మానసికంగా నాశనం చేసే పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
ఈ ఘటన సోషల్ మీడియా బాధ్యతారాహిత్యంపై పెద్ద చర్చను రేకెత్తిస్తోంది. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తులను అవమానించడం, బాధించటం సరికాదు. ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించేందుకు హక్కు ఉంది. అఘోరీ, వర్షిణి చేసిన హెచ్చరికలపై పోలీసులు, ఆరోగ్య నిపుణులు, సైబర్ క్రైమ్ విభాగం స్పందించాల్సిన అవసరం ఉంది.
ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం.
మేము తెలుగు రాష్ట్రాలలో లేము.. కేదారనాథ్ కి వెళ్లిపోతున్నాము.. మా బ్రతుకు మేము బ్రతుకుతాము మమ్మల్ని వదిలేయండి.
ఇంకా 2,3 రోజులు చూస్తాము అప్పటికి మా మీద ట్రోలింగ్ ఆపకపోతే మేమిద్దరం పెట్రోల్ పోసుకొని దహనం చేసుకుంటాము – అఘోరీ,… pic.twitter.com/LdYVUgVzrE
— greatandhra (@greatandhranews) April 18, 2025