Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2025,2:10 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

Ration Card : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తెలంగాణలో నూతన కార్డుల కోసం వేలాదిగా ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్‌ను జారీ చేసింది. వారి కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే, తప్పనిసరిగా e-KYC ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది.

Ration Card రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్

Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

Ration Card : మీరు ఇంకా e-KYC చేసుకోలేదా..? అయితే ఈ న్యూస్ చూడాల్సిందే

కేంద్రం తెలిపిన ప్రకారం.. e-KYC ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నకిలీ కార్డులు, మరణించిన వారి పేరిట కార్డులు ఉపయోగించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మోసాలను అరికట్టడం కోసం ఆధార్ ఆధారిత e-KYCని తప్పనిసరిగా చేస్తోంది. మొట్టమొదటగా మార్చి 31, 2025 గడువు నిర్ణయించినా, సాంకేతిక కారణాలతో అది జూన్ 30, 2025 వరకు పొడిగించారు. గడువు ముగిసిన తర్వాత e-KYC చేయకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది.

e-KYC ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రూపాల్లో పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియలో రేషన్ షాప్ లేదా CSC సెంటర్‌కు వెళ్లి, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకెళ్లి, బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేయాలి. ఆన్‌లైన్ పద్ధతిలో అయితే MyKYC లేదా Aadhaar FaceRD యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తిచేసి, ముఖం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి అయిన తర్వాతే మీ రేషన్ కార్డు e-KYC ప్రక్రియ సమాప్తమవుతుంది. కావున, జూన్ 30 వరకు లభ్యమయ్యే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని e-KYC తప్పకుండా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది