Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
Ration Card : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తెలంగాణలో నూతన కార్డుల కోసం వేలాదిగా ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ను జారీ చేసింది. వారి కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే, తప్పనిసరిగా e-KYC ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది.
Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
కేంద్రం తెలిపిన ప్రకారం.. e-KYC ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నకిలీ కార్డులు, మరణించిన వారి పేరిట కార్డులు ఉపయోగించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మోసాలను అరికట్టడం కోసం ఆధార్ ఆధారిత e-KYCని తప్పనిసరిగా చేస్తోంది. మొట్టమొదటగా మార్చి 31, 2025 గడువు నిర్ణయించినా, సాంకేతిక కారణాలతో అది జూన్ 30, 2025 వరకు పొడిగించారు. గడువు ముగిసిన తర్వాత e-KYC చేయకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది.
e-KYC ప్రక్రియను ఆన్లైన్, ఆఫ్లైన్ రూపాల్లో పూర్తి చేయవచ్చు. ఆఫ్లైన్ ప్రక్రియలో రేషన్ షాప్ లేదా CSC సెంటర్కు వెళ్లి, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకెళ్లి, బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేయాలి. ఆన్లైన్ పద్ధతిలో అయితే MyKYC లేదా Aadhaar FaceRD యాప్ను డౌన్లోడ్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తిచేసి, ముఖం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి అయిన తర్వాతే మీ రేషన్ కార్డు e-KYC ప్రక్రియ సమాప్తమవుతుంది. కావున, జూన్ 30 వరకు లభ్యమయ్యే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని e-KYC తప్పకుండా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.